భారతీయ రైల్వేను ప్రైవేటు పరం చేస్తున్నారన్న అంశం కొంతకాలంగా దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వ్యతిరేకిస్తుంటే.. మరికొందరు సమర్థిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ విషయంపై చర్చలు సాగుతూనే ఉన్నాయి. తాజా ఓ వీడియోతో రైల్వేలను అదానీ సంస్థకు కేంద్రం ఇచ్చేస్తోందంటూ కొందరు నెటిజన్లు రాసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
ఆదానీ సంస్థకు చెందిన ఫార్చ్యూన్ చక్కీ, ఆదానీ విల్మర్ కు సంబంధింన అడ్వర్టై జ్ మెం పోస్టర్లు ఓ రైలుపై ఉండగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఓ ఫేస్ బుక్ యూజర్ పోస్ట్ చేసి.. “అదానీ పోర్టులు, అదానీ పవర్, అదానీ కోల్ ఇండియా, అదానీ రైల్వేస్” అని పోస్ట్ చేశాడు. మరికొందరు సైతం ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తం చేశారు.
Railways' Prime Properties will be sold to the Private Sector!👇👇😔😔😥 pic.twitter.com/R1AjmWNGmM
— Shenaz30 (@iraniShenaz1958) December 11, 2020
కాసేపటేకే ఈ వీడియో వైరల్ అవడంతో పాటు ట్విట్టర్ కు వేగంగా పాకింది. “రైల్వేల ఆస్తులు త్వరలో ప్రైవేటు సెక్టార్ కు అమ్మబోతున్నారు” అంటూ ఓ యూజర్ పోస్ట్ చేశాడు. అయితే రైలు బోగీలపై ప్రకటనలు ఉండడం సహజమని, దీని ఆధారంగా రైల్వేను అమ్మేశారనడం తప్పుడు వార్త అని కొందరు అధికారులు స్పష్టం చేశారు.
గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ అదానీ ప్రకటనతో ఉన్న రైలు ఈ వీడియోను రైతుల ఉద్యమంతో లింక్ చేశారు. “అదానీ తాజా పిండి అడ్వర్టైజ్ మెంట్ను భారతీయ రైల్వేలపై చూడడం బాగా అనిపిస్తోంది. దీన్ని గమనిస్తే రైతుల ఉద్యమం సరైన దారిలోనే సాగుతోందని మనం కచ్చితంగా చెప్పగలం” అని ట్వీట్ చేశారు. మరికొందరు కూడా రైతుల ఉద్యమానికి మద్దతుగా కామెంట్లు చేస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు.
भारतीय रेल पर अदानी के फ़्रेश आटे का विज्ञापन देखने लायक़ हैं। अब तो दावे के साथ कह सकते है की किसानों की लड़ाई सत्य के मार्ग पर हैं। pic.twitter.com/WB97kaG6Fe
— Hardik Patel (@HardikPatel_) December 12, 2020
भारतीय रेल पर अदानी के फ़्रेश आटे का विज्ञापन देखने लायक़ हैं। अब तो दावे के साथ कह सकते है की किसानों की लड़ाई सत्य के मार्ग पर हैं। pic.twitter.com/yAqrq3Yvuk
— Daya Shankar Sharma (@DayaSha53222292) December 12, 2020
కాగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 16 రోజుల నుంచి రహదారులపైనే ఉంటూ రైతులు ఉద్యమం చేస్తున్నారు. పలుసార్లు కేంద్రంతో చర్చలు జరిపినా సఫలం కాకపోవడంతో పోరుబాటను కొనసాగిస్తున్నారు. రోజురోజుకూ కర్షకులకు మద్దతు పెరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Indian Railway