దేశంలో ప్రస్తుం టిక్టాక్ (TikTok) వీడియోలు కనుమరుగయ్యాయి. పబ్జీ (PUBG) ‘చికెన్ డిన్నర్లు’ జాడ లేకుండా పోయాయి. ఈ ఏడాది చైనాకు చెందిన అనేక యాప్లు భారత్లో నిషేధానికి గురయ్యాయి. ఎంతో పాపులర్ అయిన టిక్టాక్, పబ్జీ, షేర్ఇట్ (Share It) లాంటి యాప్స్ తో పాటు మరికొన్ని బ్యాన్ అయ్యాయి.
దేశ సరిహద్దులోని గల్వాన్ లోయ వద్ద చైనా దురాగతానికి భారత జవాన్లు అమరులు కావడంతో భారత్ ఆగ్రహించింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో డ్రాగన్ దేశానికి చెందిన యాప్లపై భారత ప్రభుత్వం వేటు వేసింది. దేశ సమగ్రతకు, రక్షణకు ముప్పు చేసేలా ఆ యాప్లు ఉన్నాయని ప్రభుత్వం నిషేధించింది. జూన్ 29న తొలుత టిక్టాక్, యూసీ బ్రౌజర్, కామ్ స్కారన్ సహా మొత్తం 59 యాప్లు బ్యాన్ అయ్యాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 5న ఏకంగా 118 యాప్ లపై ప్రభుత్వం వేటు వేసింది. అందులో ప్రముఖ గేమ్ పబ్జీ, పబ్జీ లైట్, వీచాట్ ఉన్నాయి. ఇక నవంబర్ 24న మరో 43 చైనా యాప్లపై భారత ప్రభుత్వం కొరడా ఘుళిపించింది. పాపులర్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అలీ ఎక్స్ ప్రెస్తో పాటు లాలా మూవ్, స్నాక్ వీడియో తదితర వాటిని నిషేధించింది.
టిక్టాక్ (TikTok) కథ ముగిసింది
షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ భారత్లో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాప్ బ్యాన్ అయ్యే నాటికి భారత్లో 20కోట్ల మంది దీన్ని వాడుతున్నారు. అయితే 2019లోనే మద్రాసు హైకోర్టు ఆదేశాలతో కొంతకాలం టిక్టాక్ గూగుల్, యాపిల్ ప్లే స్టోర్లలో కనిపించలేదు. కాగా ఈ యాప్ వల్ల యువత పెడుదోవ పడుతోందని, వీడియోలు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని తీవ్ర వ్యతిరేక వచ్చింది. టీనేజర్లలో మానసిక రుగ్మతలకు టిక్టాక్ కారణమవుతోందనే విమర్శలు వచ్చాయి. అయితే దీన్ని బ్యాన్ చేయడం సరికాదని కొంతకాలం తర్వాత సుప్రీం కోర్టు చెప్పడంతో ప్లేస్టోర్లో టిక్టాక్ మళ్లీ వచ్చింది. మద్రాసు హైకోర్టు నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే దేశ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం టిక్టాక్పై పూర్తిగా నిషేధం విధించింది.
పబ్జీ (PUBG)
యూసీ బ్రౌజర్ (UC Browser)
కొన్ని సంవత్సరాలుగా యూసీ బ్రౌజర్ భారత్లో హవా చూపించింది. గూగల్ క్రోమ్కు సవాలు విసిరింది. 2015లో ప్రపంచ వ్యాప్తంగా గూగల్ క్రోమ్ తర్వాత అత్యధికంగా వాడుతున్న బ్రౌజర్గా యూసీ నిలిచింది. ఇది కూడా చైనాలోని అలీబాబా గ్రూప్కు చెందిందే. అయితే 2017 నుంచి ఫోనల్లో డిఫాల్ట్ గా యూసీని ఇవ్వడం మైక్రోమ్యాక్స్, లావా, కార్బన్, ఇంటెక్స్ సహా కొన్ని సంస్థలు నిలిపివేశాయి. దీంతో భారత్లో 2019లో 16శాతం బ్రౌజర్ షేర్ ఉన్న యూసీ.. 2020 నాటికి ఆరు శాతానికి పడిపోయింది. కాగా ఈ బ్రౌజర్ ద్వారా డాటా లీక్ అవుతోందంటూ గతంలో కూడా చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి.
షేర్ఇట్ (ShareIt)
ఫైల్ షేరింగ్ యాప్ షేర్ఇట్ గురించి స్మార్ట్ ఫోన్ వాడే వారందరికీ తెలుసంటే అతిశయోక్తి కాదేమో. అంతలా ఈ యాప్ ఫేమస్ అయింది. దీనికి భారత్లో 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉండేవారు. ప్రాంతీయ భాషల్లో లోకల్ కంటెంట్ , వీడియోలను స్ట్రీమ్ చేయడం కూడా షేర్ఇట్ ప్రారంభించింది. అయితే ఈ ఫీచర్లు మొదలైన కొన్నాళ్లకే బ్యాన్ అయింది.
షెయిన్(Shein), క్లబ్ ఫ్యాక్టరీ (Club Factory)
చైనాకు చెందిన ఈ కామర్స్ సంస్థ క్లబ్ఫ్యాక్టరీకి రోజుకు భారత్ నుంచి 25వేల ఆర్డర్లు వెళ్లేవి. అలాగే ఫ్యాషన్ వస్తువుల ప్లాట్ఫామ్ అయిన షెయిన్కు 10వేల ఆర్డర్లు దక్కేవి. ఇతర వెబ్సైట్లు, మార్కెట్ల కంటే వస్తువులు తక్కువ ధరలో వస్తుండడంతో క్రమంగా ఈ యాప్లు పాపులర్ అయ్యాయి. అయితే వీటిపై బ్యాన్ విధించడంతో చైనా రిటైల్ను కూడా భారత్ దెబ్బకొట్టినట్టయింది. ఈ రెండు ఇప్పట్లో భారత్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలే కనిపించడం లేదు.
కామ్ స్కానర్ (Cam Scanner)
పేపర్లను ఫొటోలు తీసి ఫోన్లోనే డాక్యుమెంట్లుగా మార్చుకునేందుకు ఉపయోగపడిన కామ్ స్కానర్ భారత్లో విపరీతంగా సక్సెస్ అయింది. బ్యాన్ అయ్యే నాటికి దాదాపు 10కోట్ల మంది ఈ యాప్ను వినియోగిస్తున్నారు. డాక్యుమెంట్లను జేపీజీ, పీడీఎఫ్లుగా మార్చుకునే వీలుండేది. అయితే ప్రస్తుతం అడాబ్ స్కాన్ తో పాటు చాలా యాప్ లు దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చాయి.
అలీ ఎక్స్ప్రెస్
ఎలక్ర్టానిక్స్ తక్కువ ధరకు దొరకడంతో చైనాకు చెందిన ఆలీ ఎక్స్ప్రెస్ భారత్లో వేగంగా పాపులర్ అయింది. ముఖ్యంగా భారత్లో దొరకని కొన్ని ఎలక్ట్రానిక్స్ సైతం ఆ వెబ్సైట్లో దొరకడంతో వినియోగదారులు త్వరగా కొందరు ఆకర్షితులయ్యారు. ప్రస్తుతం ఈ వెబ్సైట్ భారత్లో ఓపెన్ అవుతున్నా.. ఎలాంటి ప్రాడక్ట్ ఆర్డర్ ఇచ్చే వీలు లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.