హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News : పోలా.. ఈ ఐడియా అదిరిపోలా.. వ్యాక్సిన్‌ వేయించేందుకు గ్రామాల దత్తత.. ఎక్కడంటే..?

Viral News : పోలా.. ఈ ఐడియా అదిరిపోలా.. వ్యాక్సిన్‌ వేయించేందుకు గ్రామాల దత్తత.. ఎక్కడంటే..?

Photo Credit : ANI

Photo Credit : ANI

Viral News : దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ మహమ్మారిని అడ్డుకట్ట వేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం. అయితే, దేశంలో కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్ పై ప్రజల్లో అపోహలు ఉన్నాయ్. దీంతో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే, దేశంలో ఓ జిల్లాలో జరుగుతున్న కొత్త రకం సాయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి ...

కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయడానికి చాలామంది పెద్దలు ముందుకొచ్చారు. తమ వంతుగా ఆక్సిజన్‌, మందులు, ఆహారం ఇస్తూ సాయపడ్డారు. అయితే పంజాబ్‌లో ఓ జిల్లాలో జరుగుతున్న కొత్త రకం సాయం మాత్రం దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. దానిని ఇతర రాష్ట్రాల్లోనూ పాటిస్తే కరోనాను మరింత త్వరగా దేశం నుంచి పారద్రోలొచ్చు. అంతటి ఆకర్షణీయం పాయింట్‌ ఏంటంటే... గ్రామాన్ని దత్తత తీసుకోవడం. ఇందులో కొత్తేముంది అంటారా... ఇక్కడ దత్తత తీసుకునేది వ్యాక్సిన్‌ వేయించడానికి. వివరాల్లోకి వెళ్తే.. మొహాలీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను జిల్లా డిప్యూటీ కమిషనర్‌ గిరీష్‌ దయాలన్‌ ముందు నుంచి జాగ్రత్తగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజలు కూడా వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్‌ వేయించండి అంటూ ప్రభుత్వం పిలుపు ఇవ్వగానే గిరీశ్‌ దయాలన్‌ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. తొలుత కొంతమంది ఉద్యోగులు వచ్చి... గ్రామాలను దత్తత తీసుకొని... అక్కడి వారికి వ్యాక్సిన్లు వేయించారు. దానికయ్యే మొత్తాన్ని వాళ్లు చెల్లించారట. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ముందుకొచ్చి అక్కడి గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ చేయిస్తున్నారట.

ఉద్యోగులు, దాతలతోపాటు పెద్ద పెద్ద సంస్థలు కూడా అక్కడ సీఎఎస్‌ఆర్‌ పాలసీ కింద డబ్బులు వెచ్చింది వ్యాక్సినేషన్‌ చేయిస్తున్నాయి. కొన్ని సంస్థలకు సీఎస్‌ఆర్‌ పాలసీ కింద డబ్బులు ఇచ్చే కన్నా, నేరుగా ప్రజలకు వ్యాక్సిన్‌ వేయించడంలోనే సంతృప్తి పొందుతున్నారేమో అని డిప్యూటీ కమిషనర్‌ అంటున్నారు. చాలామంది దాతలు ఆయా గ్రామాలకు వెళ్లి వ్యాక్సినేషన్‌ ఎలా జరుగుతోంది అనేది కూడా చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల దత్తత కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో చాలామంది దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్నారని గిరీశ్‌ చెబుతున్నారు.


దత్తత కార్యక్రమం జోరుగా సాగుతుండటంతో మొహాలీ జిల్లాలో 13 గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తయిందట. ప్రస్తుత శైలి చూస్తే త్వరలో మరింతమంది ముందుకొచ్చి... మరిన్ని గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ అయ్యేలా చూస్తారని ఆశిస్తున్నట్లు గిరీశ్‌ చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ కోసం ఒక్కో డోసుకు... దాత రూ.430 చెల్లించాలి. ఆ డబ్బును ప్రభుత్వానికి ఇచ్చి వ్యాక్సిన్‌ కొనుగోలు చేస్తోంది జిల్లా యంత్రాంగం. ఓవైపు ఇలా వ్యాక్సినేషన్‌ జరుగుతుంటే, మరోవైపు వ్యాక్సిన్‌ గురించి అవగాహన కల్పించే పనులు కూడా చేస్తున్నారు. బాగుంది కదా ఈ ఆలోచన. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా ఎవరైనా ముందుకొస్తే వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేయొచ్చు.

First published:

Tags: Corona, Corona Vaccine, Covid, VIRAL NEWS

ఉత్తమ కథలు