ఇటివల పోలీసుల బాధ్యతతో పాటు ప్రమేయం కూడా పెరగడంతో ప్రతి చిన్న విషయం కూడా పోలీసు స్టేషన్కు చేరుతోంది.. అయితే ఇలా సాధారణంగా ప్రజా సంబంధమైన కేసులు ఎక్కువగా వస్తున్నాయి.... ఇలా స్టేషన్కు వచ్చే కేసులు ఒక్కోసారి వింతగా కూడా కనిపిస్తాయి.. ఇలా తిట్టుకోవడం, కొట్టుకోవడం కాకుండా ఓ కేసు వింత కేసు మధ్యప్రదేశ్ బింధ్ జిల్లా నాయ్గావ్ పోలీస్స్టేషన్కు చేరింది. తన గేదె పాలివ్వడం లేదంటూ బాబూ లాల్ జాతవ్ (45) అనే రైతు పోలీసులను ఆశ్రయించాడు. నేరుగా గేదెను స్టేషన్కు తీసుకువచ్చి ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజులుగా తన గేదె పాలివ్వడం లేదని తెలిపాడు. బహుశా ఎవరైనా చేతబడి చేసి ఉంటారని గ్రామస్థులు చెప్పడంతో అతడు పోలీస్స్టేషన్కు వచ్చి అదే విషయాన్ని పోలీసుకు చెప్పాడు.
అయితే పోలీసులు పట్టించుకోకుండా మాములుగా వ్యవహరించారు. దీంతో ఆ రైతు కాసేసు ఆగి మరోసారి పోలీస్స్టేషన్కు వచ్చాడు.. తన గేదె విషయం ఏదో ఒక పరిష్కారం చూపాలని ప్రాధేయపడ్డాడు. దీంతో పోలీసులు ఆ రైతుకు ఓ సలహా ఇచ్చారు. గేదె పాలు ఇవ్వకపోవడానికి కారణం తెలుసుకునేందుకు పశువుల ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. అయినా వినకపోవడంతో నచ్చజెప్పి పంపించారు. దీంతో గేదెను ఆసుపత్రికి తీసుకుని వెళ్లిన మరునాడే అది పాలు ఇవ్వడం ప్రారంభించింది. తర్వాత మళ్లి స్టేషన్కు చేరుకుని ఇదే విషయాన్ని పోలీసులకు చెబుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసినట్టు స్థానిక డీఎస్పీ అరవింద్ షా తెలిపారు.
ఇది చదవండి : ఏసి బస్సులో ఎగిసిన మంటలు.. ఒకే రోజు మూడు ఆర్టీసీ ప్రమాదాలు... ఇద్దరు మృతి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Madya pradesh, Police station