BALDIA OFFICIALS TO CHECK TRAFFIC PROBLEM IN HYDERABAD GOES TO NEW PROJECTS VB
Hyderabad: ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టనున్న బల్దియా అధికారులు.. కొత్త ప్రాజెక్టులతో మరో ప్లాన్..
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు బల్దియా ప్లాన్ ను సిద్దం చేసింది. ఎస్ఆర్డీపీ సెకండ్ ఫేజ్లో భాగంగా గ్రేటర్లో మరో 17 ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్లాన్సిద్ధం చేశారు. మొత్తం నాలుగు జోన్ల పరిధి(సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, కుకట్ పల్లి)లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రధాన జంక్షన్ల వద్ద అండర్ బ్రిడ్జిలతో పాటు రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనుంది.
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. అయితే హైదరాబాద్ లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా.. ఎన్ని ఫ్లైఒవర్లు నిర్మించినా.. ట్రాఫిక్ సమస్య మాత్రం ప్రతీ సంవత్సరం ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువ కావడం లేదు. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బల్దియా ప్లాన్ ను సిద్దం చేసింది. అదేంటంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్( ఎస్ఆర్డీపీ ) సెకండ్ ఫేజ్లో భాగంగా గ్రేటర్లో మరో 17 ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్లాన్సిద్ధం చేసింది. మొత్తం నాలుగు జోన్ల పరిధి(సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, కుకట్ పల్లి)లో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రధాన జంక్షన్ల వద్ద అండర్ బ్రిడ్జిలతో పాటు రోడ్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించనుంది. రూ.1230 కోట్లతో ఈ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ప్రభుత్వం నుంచి ఇందుకు అనుమతులు తీసుకొని టెండర్ల ప్రాసెస్ ను పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు రెడీ అవుతున్నారు. అండర్ బ్రిడ్జి నిర్మాణాల వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశం ఉంటుందని బల్దియా వీటిపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
ఖర్చు ఎక్కువగా లేకుండా ట్రాఫిక్ సమస్య తీరుతుండటంతో వీలైనంత వరకు అండర్ బ్రిడ్జిలను నిర్మించాలని గ్రేటర్ అధికారులు భావిస్తున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా అందులో ఇప్పటివరకు 20 ప్రాజెక్టులు అందుబాటులోకి రాగా.. 8 ప్రాంతాల్లో అండర్ పాస్ నిర్మాణాలే ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ఫేజ్ లో 15 అండర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు. ఒకవేళ ఇళా అండర్ బ్రిడ్జి సాధ్యం కాకపోతేనే రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే చాలా చోట్ల ట్రాఫిక్ సమస్య తీరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగానే రోడ్ అండర్ బ్రిడ్జిల నిర్మాణంతోపాటు రోడ్ ఓవర్ బ్రిడ్జిలను కూడా నిర్మించాలని బల్దియా అధికారులు నిర్ణయించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో రూ.635కోట్లతో 10 ప్రాంతాల్లో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టనున్నారు. కూకట్ పల్లి జోన్ పరిధిలో రూ.250 కోట్లతో 3, చార్మినార్ జోన్ లో రూ.195 కోట్లతో 2, ఖైరతాబాద్ జోన్ పరిధిలో రూ.150 కోట్లతో రెండు ప్రాంతాల్లో ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా మొత్తం 17 ప్రాజెక్టులకోసం రూ.1230 కోట్లు ఖర్చు చేయనున్నారు.
సికింద్రాబాద్ జోన్కి సంబంధించి10 ప్రాజెక్టుల్లో ఎక్కువ పనులు రైల్వే ఏరియాల్లోనే ఉన్నాయి. దీంతో రైల్వే, బల్దియా అధికారులు సమన్వయంతో పనిచేస్తే మరింత తొందరగా ఈ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. ఫస్ట్ ఫేజ్లో పెండింగ్ పనులను పక్కన పెట్టి ప్రస్తుతం సెకండ్ ఫేజ్లో భాగంగా 17 ప్రాజెక్టుల పనులను ప్రారంభించేందుకు బల్దియా సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని పనులను సెకండ్ ఫేజ్లో చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సెకండ్ ఫేజ్లోని పనులతో పాటు పాత వాటిపై కూడా ఫోకస్ పెట్టి వాటిని తొందరగా పూర్తి చేయాలని హైదరాబాద్ నగర వాసులు కోరుతున్నారు. కొత్తగా నిర్మించనున్న సెకంట్ ప్రాజెక్ట్ లో నగరంలోని ముఖ్యంగా సికింద్రాబాద్ జోన్లో మెట్టుగూడ, పాటిగడ్డ ప్రాంతాల్లో రోడ్ఓవర్ బ్రిడ్జిలు, మౌలాలి స్టేషన్, చిలకలగూడ, మాణికేశ్వరనగర్, కాకతీయనగర్, వినాయక నగర్, మల్కాజిగిరి, సఫిల్గూడలలో అండర్ పాస్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ జోన్ పరిధి రాజ్భవన్, ఖైరతాబాద్లో అండర్ పాస్ల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. చార్మినార్ జోన్లో ఫలక్నుమా, బుద్వేల్, ఆరాంఘర్ వద్ద రోడ్ అండర్ బ్రిడ్జిలను నిర్మించ నున్నారు. కూకట్పల్లి జోన్ పరిధిలో సుచిత్ర నుంచి ఓల్డ్ అల్వాల్, వెంకటాపురం నుంచి ఓల్డ్ అల్వాల్ మధ్యలో, బొల్లారం నుంచి గుండ్లపోచంపల్లి మధ్యలో అండర్ బ్రిడ్జిలను నిర్మించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.