19 హత్యలు చేసిన భార్య భర్తలు..
ఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లోని ఓ జంట కరుడుగట్టిన క్రిమినల్స్గా మారారు..అందరితోపాటు పనులు చేస్తూనే..నమ్మకంగా ఉంటూ హత్యలకు తెరలేపారు..అదికూడా ఆడవాళ్ల మీద ఉండే..బంగారు నగల కోసం హత్య చేయడం సంచలనంగా మారింది. ఇలా ఇద్దరు భార్య భర్తలు కూడా హత్యలకు పాల్పడుతున్నారు....బంగారం కోసం.. హత్యల కోసం పోటిపడ్డంటూ వ్యవహరించారు.ఇలా భార్య 11 మందిని హత్య చేస్తే.. 9మందిని హత్య చేశాడు. ఇలా హత్యల మీద హత్యలు చేస్తూ..నేడు పోలీసులకు పట్టబడ్డారు.
బంగారం పై కన్ను..
బంగారం ఒంటిపై ఉన్న కూలీలతో నమ్మకంగా ఉంటూ మాయమాటలు చెప్తారు. అనంతరం తమ ఇంటివద్ద పని ఉందంటూ తీసుకువెళతారు. ఇలా సంగారెడ్డి జిల్లా జిన్నారం అడవుల్లోకి తీసుకువెళ్లి హత్య చేయడం..వారి నుండి నగలు దోచుకోవడం వారికి అలవాటుగా మారినట్టు పోలీసులు వివరించారు.
ఇలా పట్టుబడ్డారు...
అయితే.. నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రతండాకు చెందిన భామిని అనే 39 సంవత్సరాల మహిళ అడ్డకూలీగా పని చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు భార్యభర్తలు ఈనెల 25న కూలీ పని ఉందంటూ తీసుకువెళ్లారు. అనంతరం ఆమెను జిన్నారం మండలం మాదారం గ్రామపంచాయితీ మంత్రికుంట శివారు అటవీ ప్రాంతంలో బండరాళ్ల హత్య చేసి పడేశారు.ఆమెపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లారు. చివరికి ఆమెపై ఆత్యాచారం కూడా చేసినట్టు పోలీసులు తెలిపారు.
దుండిగల్ పోలీసులకు దొరికిన నిందితులు
దీంతో సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. అనంతరం ఆ మహిళను తీసుకువెళ్లిన నర్సమ్మ,స్వామి ఇద్దరు భార్యభర్తలను విచారించారు.ఈ విచారణలో భార్య భర్తలు ఇద్దరు కలిసి 19 హత్యలు చేసినట్టు పోలీసులు విచారణలో తేలినట్టు సమాచారం..అయితే ఇన్ని హత్యలు జరిగినా ఎవరు అనుమానించకుండా వ్యవహరించిన జంటపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు సిద్దమయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Mahabubnagar