ఎమ్మెల్యేల కొనుగోలు కేసును విచారిస్తున్న సిట్ బృందంలోని ఏసిపి గంగాధర్ పై ఏసీబీ కోర్టు (Acb Court) ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతీ (Rama chandra bharathi), నందకుమార్ (Nandhakumar), సింహయాజి (Simhayaji)లకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది హైకోర్టు. ప్రతీ సోమవారం సిట్ (Special Investigaion Team) ముందుకు హాజరు కావాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రూ.3 లక్షల పూచికత్తుపై బెయిల్ మంజూరు చేసింది.
అయితే ముగ్గురి పాస్ పోర్టులను కోర్టులో సరెండర్ చేయాలనీ, ఎట్టి పరిస్థితుల్లో దేశం విడిచి వెళ్లోద్దని హైకోర్టు (Telangana High Court) పేర్కొంది. అయితే నిందితుల బెయిల్ షూరిటీలో స్థానికులనే పరిగణలోకి తీసుకోవాలని ఏసీపీ గంగాధర్ మెమో దాఖలు చేశారు. అయితే గంగాధర్ మెమో దాఖలుపై ఏసీబీ కోర్టు (Acb Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. మాకు డైరెక్షన్ ఇవ్వడానికి మీరెవ్వరు అంటూ ప్రశ్నించింది. దీనిపై గంగాధర్ బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే కోర్టు ధిక్కరణగా పరిగణిస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో ఏసీపీ గంగాధర్ మెమోను వెనక్కి తీసుకొని, కోర్టుకు (Acb Court) క్షమాపణలు చెప్పాడు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి బుధవారం హైకోర్టు (High Court) లో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసుకు సంబంధించి పిటీషన్లపై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. తప్పు చేయనప్పుడు తెలంగాణ సిట్ (Special Investigation Team) కు ఎందుకు సహకరించడం లేదు, దేనికి భయపడుతున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే వాదనలు వినిపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయి. నిందితులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని దవే చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వీడియో ద్వారా బయటపెట్టారు. ప్రభుత్వాన్ని కూల్చుతుంటే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందని అన్నారు. కేసీఆర్ వీడియోలను బయటపపెట్టడాన్ని తప్పుగా చూయించడం ఏంటని దవే వాదనలు వినిపించారు. సిట్ (Special Investigation Team) విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే కోర్టు ముందు చెప్పారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే చెప్పుకొచ్చారు.
ఈ కేసు రాజకీయ దురుద్దేశ్యంతోనే సిట్ (Special Investigation Team) ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారని బీజేపీ తరపు న్యాయవాది మహేష్ జెఠ్మలానీ చెప్పుకొచ్చారు. కేసీఆర్ కనుసన్నుల్లోనే సిట్ (Special Investigation Team) విచారణ జరుగుతుందన్నారు. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ సహా నిందితుల తరపు న్యాయవాదులు కోరుతున్నారు. ఇక తదుపరి విచారణ డిసెంబర్ 6కు వాయిదా వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ACB, Hyderabad, Telangana, TRS MLAs Poaching Case