కానిస్టేబుల్ (Constable)పెళ్లి చేసుకుంటానని వెంటపడటం, ఫోన్లు చేస్తూ టార్చర్ (Tortured)పెట్టాడు. తాను చేస్తోంది చిన్న ఉద్యోగం ..వేధిస్తున్న వ్యక్తి పోలీసు కానిస్టేబుల్ కావడంతో దిక్కుతోచని స్ధితిలో ఉన్న యువతి పోలీస్ కానిస్టేబుల్ పెట్టే వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ములుగు జిల్లా ఏటూరునాగరం(Eturunagaram)లోని అంగన్వాడి కేంద్రంలో(Icds) సూపర్వైజర్గా విధులు నిర్వహిస్తోంది సంగీత. మృతురాలిది స్వగ్రామం హనుమకొండ (Hanumakonda)జిల్లా శాయంపేట శాయంపేటమండలం మందరిపేటమందరిపేట. హనుమకొండలో ట్రాఫిక్ కానిస్టేబుల్Traffic Constableగా పనిచేస్తున్న సర్వేష్యాదవ్ (Sarvesh Yadav)సంగీతకు పరిచయమయ్యాడు. కాకతాళీయంగా పరిచయమైన సర్వేష్ యాదవ్ మృతురాలు సంగీతను ఇష్టపడ్డాడు. పదే పదే ఫోన్ (Phone)చేసి పెళ్లి చేసుకుందాం, నిన్ను పెళ్లి చేసుకుంటాని నువ్వు ఒప్పుకోకపోతే బాగోదని వేధించసాగాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్గా ఉన్న సర్వేష్ పెట్టే టార్చర్ భరించలేకపోయింది. ఇంట్లో తండ్రి వీరయ్యతో పాటు పెద్దలకు చెప్పుకోలేక ..తనలో తానే కుమిలిపోయింది. వేరే దారి లేకపోవడంతో సంగీత సోమవారం ఏటూర్నాగారంలో డ్యూటీ ముగించుకొని మందరిపేటలోని ఇంటికి చేరుకుంది. రాత్రి 9గంటల సమయంలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందుతాగింది. ఆ తర్వాత జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పుకుంది.
పెళ్లి పేరుతో పోలీస్ టార్చర్..
సంగీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన పరకాలలోని సౌందర్య ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచించింది సంగీత. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తన బిడ్డను కానిస్టేబుల్ సర్వేష్ పెళ్లి చేసుుకుంటానని వేధించడం వల్లే చనిపోయిందని మృతురాలి తండ్రి వీరయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. పరిచయం పేరుతో ఫోన్ట్రా నెంబర్ తీసుకొని పదే పదే కాల్స్ చేయడం, ఫోన్లో పెళ్లి ప్రస్తావన వేరు తెచ్చి వేధించడం తట్టుకోలేకపోయింది మృతురాలు. ఈ విషయాన్ని తమతో చెప్పుకోలేక.. కానిస్టేబుల్ సర్వేష్ యాదవ్ ఏమి చేయలేక తనలో తానే కుములిపోయిందని సంగీత తండ్రి వీరయ్య పోలీసులకు చెప్పాడు. తన బిడ్డ చావుకు కారణమైన ట్రాఫిక్ కానిస్టేబుల్ సర్వేష్ యాదవ్ని వెంటనే అరెస్ట్ చేసి అతడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు సంగీత కుటుంబ సభ్యులు.
ఎవరికి చెప్పుకోలేక..
హనుమకొండ ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న సర్వేష్యాదవ్పై సంగీత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి కంప్లైంట్ ఆధారంగా కానిస్టేబుల్ సర్వేష్యాదవ్పై కేసు నమోదు చేసినట్లుగా శాయంపేట ఎస్ఐ వీరభద్రరావు తెలిపారు. ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిల వెంటపడుతూ వేధించే వాళ్లను వదిలిపెట్టవద్దని...జీవితాంతం గుర్తుండిపోయే విధంగా శిక్షించాలని మహిళ సంఘాలు డిమాండ్ చేశాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Conistables, Crime news, WARANGAL DISTRICT