(Santhosh, News 18, Warangal)
మరణం తరువాత ప్రతి మనిషి అంత్యక్రియలు సంప్రదాయంగా జరగాలని.. గౌరవప్రదమైన పద్దతిలో ఒక నిర్దేశిత ప్రదేశంలో జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టింది. అయితే ఈ క్రమంలో వరంగల్ జిల్లాలోని గ్రామ పంచాయితీలకు వైకుంఠధామాలు మంజూరు చేసింది. కానీ జిల్లాలో ఇప్పటికీ కొన్ని చోట్ల వైకుంఠధామాలు పూర్తి కాలేదు.. మరి మిగతావి పూర్తయ్యేదెప్పుడు? అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు అంటూ ప్రజలు, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారు.
మనిషి చనిపోతే ఎక్కడ దహనం చేయాలో తెలియక నిరుపేదలు చెరువులు, వాగులు, కాలువలు దగ్గర ఎక్కడ స్థలం దొరికితే అక్కడ దుర్భరమైన పరిస్థితుల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. చివరి మజిలీ అయినా చక్కగా చేద్దామంటే సొంత భూమి లేక చాలామంది అంత్యక్రియలు ఎక్కడపడితే అక్కడ చేస్తున్నారు. కనీసం పట్టణాలలో అయిన స్మశానవాటికలు ఉండటం వల్ల పట్టణ ప్రజల చివరి మజిలీ గౌరవప్రదంగా అవుతుందనుకుంటే ఇక్కడి పరిస్థితి అంతే.
స్మశాన వాటికలు ఉన్నా వాటిల్లో కనీస వసతులు లేవు. దహన సంస్కారం అనంతరం స్నానాలు చేసేందుకు నీటి సదుపాయం ఉండదు. మహిళలు బట్టలు మార్చుకోవడానికి రూంలు ఉండవు. ఒక పక్క కాష్టం కాలుతుంటే చుట్టుపక్కల ఉన్న పందులు, కుక్కలు వాటిని చెల్లా చెదారం చేస్తాయి. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది పందులను పంపించే ప్రయత్నం చేస్తే పందుల పెంపకారులు వారిని బెదిరింపులులకు గురి చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా తమ కష్టాలను బల్దియా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal