హోమ్ /వార్తలు /తెలంగాణ /

వికారాబాద్ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు.. ఈవీఎంలు ఓపెన్ చేసినందుకే...

వికారాబాద్ కలెక్టర్‌పై సస్పెన్షన్ వేటు.. ఈవీఎంలు ఓపెన్ చేసినందుకే...

వికారాబాద్ కలెక్టర్ ఉమర్ జలీల్

వికారాబాద్ కలెక్టర్ ఉమర్ జలీల్

హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలను తెరిచినందుకు వికారాబాద్ కలెక్టర్ ఉమర్ జలీల్‌ను సస్పెండ్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

    వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ఉమర్ జలీల్‌ను సస్పెండ్ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ జరిగాయి. వికారాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, వికారాబాద్ ఎన్నిక చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.


    Telangana Elections 2018 | Polling Day | అమావాస్య అంటే చాలు తెలుగువారికి అచ్చిరాని రోజుగా ఓ సెంటిమెంట్ ఉంది. ఆ రోజు ఏ కార్యక్రమం చేపట్టాల్సి వచ్చినా, వీలైనంతవరకూ దాన్ని వాయిదా వేసుకుంటారు. వివాహాలు, శుభకార్యాలు, కొత్త వస్తువులు, భూముల కొనుగోలు వంటివి వీలైనంతవరకూ అమావాస్య రోజున జరగవు. అలాంటిది అత్యంత కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సరిగ్గా అమావాస్య రోజునే జరుగుతున్నాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు అన్ని పార్టీల నేతలు. Telangana Elections 2018 | Assembly Elections Polling held on New Moon day, leaders feel bad about this sentiment telangana elections, telangana elections 2018, telangana news, telangana, telangana assembly elections, telangana assembly elections 2018, telangana politics, telangana congress, తెలంగాణ ఎన్నికలు సర్వే, తెలంగాణ ఎన్నికలు అమావాస్య రోజున పోలింగ్,
    ఈవీఎం (ఫైల్ ఫొటో)


    ఓ వైపు ప్రసాద్ కుమార్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలను పరిశీలిస్తున్న క్రమంలో కలెక్టర్ ఉమర్ జలీల్.. అన్ని ఈవీఎంలతో పాటు వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికలకు ఉపయోగించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను కూడా తెరిచారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, ఆ ఈవీఎంలను తెరవడం చట్టప్రకారం తప్పు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.


    telangana elections, telangana elections 2018, telangana news, telangana assembly elections, telangana election news, telangana election polls, telangana election results, telangana, trs telangana elections, telangana elections scam, telangana elections fruad, telangana polls, survey on telangana elections, telangana election survey, telangana election date, telangana election live, telangana elections updates, elangana elections results, తెలంగాణ ఎన్నికలు, పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు, Telangana Assembly Elections 2018: Congress is getting Lead in Postal Ballet Results, TRS got Second Place, మొత్తం 119 నియోజకవర్గాల్లో పోస్టల్‌ బ్యాలెట్లను విశ్లేషించగా... 73 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం కనబరిచింది. అధికార టీఆర్‌ఎస్‌ 28 స్థానాల్లోనూ, బీజేపీ 10 స్థానాల్లోనూ పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్లను సాధించాయి. ఇక మజ్లిస్‌ 4, టీడీపీ 2, బీఎస్పీ 2 స్థానాల్లో నిలిచాయి.
    ఎన్నికల విధుల్లో ఉద్యోగులు (File)electio


    కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈ ఘటనపై విచారణ జరిపించారు. ఓ కమిటీ వికారాబాద్ వెళ్లి ఆ రోజు జరిగిన వివరాలను సేకరించింది. అయితే, హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న విషయం తనకు తెలియదని, అందుకే వాటిని తెరిచానంటూ కలెక్టర్ వివరణ ఇచ్చారు. అయితే, ఆ వాదనతో కమిటీ ఏకీభవించలేదు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని తాము తెలియజేశామని, కలెక్టర్ ఆ విషయం తెలియదని చెప్పడం బాధ్యతారాహిత్యంగా భావించి, ఉమర్ జలీల్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.


    ఇవి కూడా చదవండి


    మోదీ వస్తే భయమెందుకు?: టీడీపీకి బీజేపీ ప్రశ్న


    First published:

    Tags: Election Commission of India, Telangana Election 2018

    ఉత్తమ కథలు