హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG: ఆదిలాబాద్​లోని ఓ పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన మృతదేహం.. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే..

OMG: ఆదిలాబాద్​లోని ఓ పొలంలో చెట్టుకు వేలాడుతూ కనిపించిన మృతదేహం.. ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే..

చెట్టుకు ఉరేసుకున్న రైతు

చెట్టుకు ఉరేసుకున్న రైతు

పంటసాగు కోసం ఎక్కడా అప్పు దొరకక మనస్తాపానికిలోనై ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఒకరు ఉరి వేసుకొని, మరొకరు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

(Lenin, News18, Adilabad)

చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆత్మహత్యకు (Farmers suicide) పాల్పడిన రైతుల ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అయితే పంట సాగుకు (Crop Harvesting) అవసరమైన పెట్టుబడి కోసం ఎక్కడా అప్పు లభించక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు (Two farmers died) పాల్పడిన విషాదకర సంఘటన ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఖడ్కి గ్రామానికి చెందిన మడావి మారు అనే రైతులు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత సంవత్సరం అధిక వర్షలతో ఆశించిన పంట దిగుబడి రాలేదు. ఇదీకాక పోయిన సంవత్సరం చేసిన కూతురి పెళ్ళి కోసం అప్పు చేయాల్సి వచ్చింది. బ్యాంకు లో కూడా లక్ష రూపాయల పంట రుణం తీసుకున్నాడు.

విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక..

ఈ యేడు వానాకాలం పంట సాగుకు విత్తనాలు, ఇతరత్ర అవసరాల కోసం డబ్బు అవసరమైంది. గతేడాది చేసిన బ్యాంకు రుణం (Bank loan) ప్రభుత్వం మాఫీ చేస్తుందని తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు మళ్లీ రుణం ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో పంట పెట్టుబడి కోసం అవసరమై అప్పు కోసం ప్రయత్నం చేసినప్పటికి ఎక్కడా అప్పు లభించలేదు. విత్తనాల కొనుగోలుకు డబ్బులు లేక మనస్థాపం చెందిన మడావి మారు తన పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.

Employment Guarantee Scheme: ఆ జిల్లాలో  ఆగమ్యగోచరంగా ఉపాధి హామీ కూలీల పరిస్థితి..  వేతనాలు చెల్లింపులో జాప్యంతో పస్తులు

ఇదిలా ఉంటే కొమురంభీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లా కెరమెరి మండలం తుమ్మగూడకు చెందిన రాథోడ్ మోహన్ కూడా ఈ యేడు పంటసాగుకు అవసరమైన పెట్టుబడి కోసం అప్పుకోసం ప్రయత్నం చేశాడు. అప్పు లభించకపోవడంతో మనస్థాపం చెంది పురుగుల మందు  తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు రాథోడ్ మోహన్ కు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో గత సంవత్సరం పత్తి పంట సాగు చేశాడు. ఇందుకోసం రెండు లక్షల రూపాయల అప్పుతీసుకువచ్చాడు.

Fishermen Skill Test: అక్కడ మత్స్యకారుడికీ ఓ పరీక్ష ఉంటుంది తెలుసా.. పాసైతేనే మత్స్యకారుడిగా గుర్తింపు..

ఆశించిన పంట దిగుబడి రాక, సాగుకు చేసిన అప్పు చెల్లించలేకపోయాడు. ఈయేడు మళ్లీ వానాకాలం సాగు కోసం అప్పు కోసం ఎక్కడెక్కడో ప్రయత్నించాడు. కానీ ఎక్కడా అప్పు దొరకలేదు. ఇదే విషయం భార్యతో చెప్పుకుంటూ మదనపడ్డాడు. చివరకు మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Adilabad, Asifabad, Farmers suicide

ఉత్తమ కథలు