టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన తరువాత రేవంత్ రెడ్డి (Revanth Reddy) దూకుడు పెంచారు. సమయం దొరికినప్పుడల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అవినీతిని ఎండగడుతూ తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అలాగే వీలు దొరికినప్పుడు ప్రజలతో నిత్యం మమేకమై కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ సమక్షంలో పలువురు TRS, BJP నాయకులూ హస్తం గూటికి చేరారు. గతంతో పోలిస్తే కాంగ్రెస్ బలం పెరుగుతూ వస్తుంది.
Munugode: మునుగోడులో తేడా వచ్చిందో.. మీ పనీ.. నా పనీ ఔట్.. మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..
మునుగోడులో (Munugodu By poll)లో పెద్ద కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీని చంపటానికి ఎత్తులు వేస్తున్నారు. వారి ఎత్తులను చిత్తు చేసి పార్టీని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి (Revant Reddy) కార్యకర్తలకు సూచించారు. నేను కూడా పోలీస్ తూటాలకు ఎదురు నిలబడతా అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయడానికి సీఎం కేసీఆర్ సుఫారీ తీసుకున్నాడు. మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందాం. దివిసీమలా తెలంగాణ కాకూడదని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
లాటి తూటాలకైనా తుపాకి గుండ్లకైనా నేను సిద్ధం! ప్రాణాలు సైతం ఇచ్చేందుకు చివరి శ్వాస వరకు కాంగ్రెస్ కోసం పని చేస్తా!
కాంగ్రెస్ని బ్రతికించుకుందాం!పార్టీ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి గారి పిలుపు!
మునుగోడుకు రండి పార్టీని కాపాడుకుందాం దివిసీమలా మన రాష్ట్రం కాకూడదు
- @revanth_anumula pic.twitter.com/FrQONe2jIi
— Telangana Congress (@INCTelangana) October 20, 2022
అందుకోసం 10 రోజుల పాటు ఢిల్లీలో ప్రధాని మోడీ, అమిత్ షాలతో రహస్య మంతనాలు జరిపారన్నారు. మునుగోడు బైపోల్ లో కాంగ్రెస్ ను ఓడించి పీసీసీ అధ్యక్షుడిగా నన్ను తొలగించాలని చూస్తున్నారని రేవంత్ (Revant Reddy) ఆరోపించారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని, పార్టీ కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధం అని రేవంత్ పేర్కొన్నారు.
మునుగోడులో (Munugodu) రెండు అధికార పార్టీలైన బీజేపీ,టీఆర్ఎస్ డబ్బును వెదజల్లుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని చంపాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ కార్యకర్తలకు సూచించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, పీసీసీ పదవి సోనియా గాంధీ ఇచ్చిన అవకాశమని రేవంత్ (Revant Reddy) అన్నారు. తనకు పీసీసీ పదవి వచ్చిన దగ్గరి నుండి కేసీఆర్, బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పుడు తాను ఒంటరి వాడయ్యానని రేవంత్ రెడ్డి (Revant Reddy) కన్నీటి పర్యంతమయ్యారు. కావాలనే ఎన్నికల బరిలో తనను ఒక్కడిని ఏకాకిగా వదిలేశారని తన మనసులోని బాధను రేవంత్ రెడ్డి (Revant Reddy) మీడియాతో చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.