హోమ్ /వార్తలు /తెలంగాణ /

Delhi: కల్వకుంట్ల కవితను 9గంటలు విచారించిన ఈడీ ..మళ్లీ ఎప్పుడు రమ్మన్నారంటే

Delhi: కల్వకుంట్ల కవితను 9గంటలు విచారించిన ఈడీ ..మళ్లీ ఎప్పుడు రమ్మన్నారంటే

kalvakuntla kavitha

kalvakuntla kavitha

Kalvakuntla Kavitha:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు 9గంటల పాటు ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED) అధికారులు ప్రశ్నించారు.కవితను ఈనెల 16వ తేదిన మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. సుమారు 9గంటల పాటు ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED) అధికారులు ప్రశ్నించారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకి వెళ్లిన కవితను జాయింట్ డైరెక్టర్‌ నేతృత్వంలో ఐదుగురు అధికారుల బృందం ప్రశ్నించడం జరిగింది. విచారణ ముగియగానే ఆమె నేరుగా నివాసానికి చేరుకున్నారు. లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టైన రామచంద్రపిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఈకేసు విచారణలో భాగంగానే కల్వకుంట్ల కవితను ఈనెల 16వ తేదిన మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఈడీ నోటీసులు ఇచ్చింది.

9గంటల పాటు విచారణ..

కవితను ఈడీ అధికారులు ఈనెల 13న మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పడంతో ఆరోజు కవిత జన్మదినం కావడం వల్ల 16వ తేదిన వస్తానని ఈడీకి చెప్పడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరెట్ అధికారులు అంగీకరించారు.

Hyderabad: GHMC మేయర్ విజయలక్ష్మి అరెస్ట్..రాజ్‌భవన్‌ ముందు టెన్షన్ టెన్షన్

ప్రశ్నల వర్షం ..

కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు ప్రశ్నించిన సమయంలో ఈడీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఢిల్లీలో BRS కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆందోళనలు చేపట్టారు.

16న మళ్లీ విచారణకు..

ఈ కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై.. తాను కవితకు బినామీని అనీ, అంతా ఆమె చెప్పిన ప్రకారమే చేశానని... ఈడీ విచారణలో స్టేట్‌మెంట్ ఇవ్వడంతోనే... కవితను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు.

First published:

Tags: Delhi news, Kalvakuntla Kavitha

ఉత్తమ కథలు