తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.అకాల వర్షాల వలన సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని ఆదేశించారు. నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లాలని.. రైతు సోదరులకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి భరోసా ఇచ్చేలా వారి విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని సూచించారు. దీంతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలని ఆదేశించారు.
సీఎం కేసీఆర్(KCR) సూచన మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశం పైన దృష్టి సారించి వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని అన్నారు. గ్రామస్థాయిలో ఉపాధి హామీ తో పాటు పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపు పైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన 1300 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని ఆరోపించారు. వచ్చేనెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలి ఇందుకు సంబంధించి, ఇప్పటికే జిల్లా ఇంఛార్జ్లా వెళ్లిన వారి ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయని అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారని... దాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలి. ప్రతి కార్యకర్తకు ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండుసార్లు తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు దోహదం చేసిన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ సీఎం కేసీఆర్ పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలని అన్నారు. ప్రతి ప్రతి గ్రామాలకు నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన మేరకు ముందుకు పోవాలని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత వారితో ఉన్న అనుబంధాన్ని వివరించేలా కార్యక్రమన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు.
సమావేశాల్లో పార్టీ శ్రేణుల ప్రాధాన్యత తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలని అన్నారు. దీంతోపాటు దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితుల పైన కూడా విస్తృతంగా మాట్లాడుకోవాలని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా మోదీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలతో పాటు నిత్యవసర సరుకుల ధరలు మోడీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలు వంటి వాటిని మన కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి, ప్రజా బహుల్యంలోకి వాటిని తీసుకువెళ్లేలా చూడాలని ఆదేశించారు.
హైదరాబాద్లో భారీగా పెరగనున్న మామిడి పండ్ల ధరలు.. ఇదే కారణం.. !
TSPSC : రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు.. సడెన్గా ఇలా ఎందుకు?
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు రాకుండా అడ్డుకోవడం, ఇవ్వాల్సిన ఇవ్వకుండా పెండింగ్లో పెట్టడం తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రగతిని అడ్డుకుంటున్న తీరును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన పార్టీ శ్రేణులు పైన ఉన్నదని కేటీఆర్ అన్నారు. ఏప్రిల్ 20వ తేదీ నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గస్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించుకోబోతున్నామని వివరించారు. ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ప్లీనరీ జరుగుతుందన్న కేటీఆర్... దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.