తెలంగాణలోని మరో కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే ఒకే ఇంట్లోని దంపతులతో పాటు కుమారుడుతో సహా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నపల్లిలో నివాసం ఉంటున్న బైరి శంకరయ్య(55), జమున(50) భార్య భర్తలు కాగా కొడుకు శ్రీధర్ సహా తమ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.
అనంతంర పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. కాగా ఆ కుటుంబం ముగ్గురు ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడం వెనక అప్పులే కారణమని ప్రాధమికంగా చెబుతున్నారు. కొడుకు తోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. పెద్ద కూతురుకు ఇదివరకే పెళ్లి కాగా చిన్న కూతురుకు మూడు నెలల క్రితమే పెళ్లి చేశారు. కొడుకు శ్రీధర్ ఓ ప్రైవేట్ కంపనీలో ఉద్యోగం చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. చేనేత మగ్గాలపై ఆధారపడిన కుటుంబం ఇటివల అందుకు సంబంధించి పనులు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు చెబుతున్నారు. దీంతో ముగ్గురు ఒకేసారి తమ ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
కాగా ఇటివల ఖమ్మం జిల్లాలో వనమా రాఘవ వేధింపులతో పాటు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రామకృష్ణ తన భార్య పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు భార్య,భర్తలతో పాటు ఇద్దరు కొడుకులు కూడా ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు సైతం రాష్ట్రంలో కలకలం రేపాయి.. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు కుటుంబాలకు కుటుంబాలే ఆత్మహత్య చేసుకుంటున్న వారికి ప్రభుత్వ అధికారులు భరోసా కల్పిస్తే కాని ఇలాంటి ఆత్మహత్యలు ఆగే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Karimnagar