హోమ్ /వార్తలు /తెలంగాణ /

Early Polls in Telangana: గుజరాత్ తో పాటు తెలంగాణ ఎన్నికలు.. కేసీఆర్ స్కెచ్ ఏంటో చెప్పిన రఘునందన్

Early Polls in Telangana: గుజరాత్ తో పాటు తెలంగాణ ఎన్నికలు.. కేసీఆర్ స్కెచ్ ఏంటో చెప్పిన రఘునందన్

రఘునందన్ రావు (ఫొటో: ట్విట్టర్)

రఘునందన్ రావు (ఫొటో: ట్విట్టర్)

తెలంగాణ(Telangana)లో ముందస్తు ఎన్నికలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR) ముందస్తు ఎన్నికల ప్లాన్ కు సంబంధించిన లాజిక్ ను ఆయన వివరించారు. రఘునందన్ ఏమన్నారంటే..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు (Telangana Early Polls) ఖామమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. గుజరాత్ ఎన్నికలతో (Gujarat Elections) పాటే సీఎం కేసీఆర్ (CM KCR) కూడా ఎన్నికలకు వెళ్లేందుకు స్కెచ్ వేస్తున్నారన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అధికర పక్షంలో కన్నా కూడా ప్రతిపక్షాల్లోనే ఈ చర్చ జోరుగా సాగుతోంది. అంతర్గత సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు తమ క్యాడర్ కు ఈ మేరకు దిశానిర్ధేశం సైతం చేస్తున్నాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని, ఈ మేరకు తమ వద్ద సమాచారం ఉందని పార్టీ శ్రేణులకు ఆయా నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే అధికార టీఆర్ఎస్ నేతలు మాత్రం అదేమి ఉండదంటూ కొట్టి పారేస్తున్నారు. అయితే.. తాజాగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయంటూ వస్తున్న వార్తలపై తనదైన శైలిలో స్పందించారు.

ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కేసీఆర్ కేంద్రంపై కొట్లాట ఆపి రెస్ట్ తీసుకుంటాడన్నారు. ఒక వేళ యూపీ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీకి నష్టం వాటిల్లితే ప్రభుత్వాన్ని రద్దు చేసి గుజరాత్ ఎలక్షన్స్ తో పాటు కేసీఆర్ ఎన్నికలకు వెళ్తాడని జోస్యం చెప్పారు. గుజరాత్ లో ఎన్నికలు జరిగే సమయంలో మోదీ, అమిత్ షా అక్కడే బిజీగా ఉంటారని.. తెలంగాణపై ఆ సమయంలో శ్రద్ధ చూపే అవకాశం వారికి ఉండదన్నది కేసీఆర్ ఆలోచన అని రఘునందన్ వివరించారు.

Bandi sanjay: టీఆర్​ఎస్​ ప్రభుత్వంపై మరోసారి ఎటాక్​కు బీజేపీ సిద్ధం​.. వచ్చే అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాల్లో మిలియన్​ మార్చ్​కు సన్నాహాలు

అయితే యూపీలో తాము ఓడిపోతామన్నది కేసీఆర్ భ్రమ మాత్రమే అని రఘునందన్ అన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వారంలోనే వంద మంది అభ్యర్థులను బరిలో దించి మంచి ఫలితాలను సాధించిన రికార్డు తమకు ఉందని ఆయన గుర్తు చేశారు.

Revanth Reddy: సీఎం కేసీఆర్​కు టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి బహిరంగ లేఖ.. ఆ వార్తా కథనంపై స్పందించాలని డిమాండ్​

గత పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీకి 23 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని రఘునందన్ రావు వివరించారు. తమ పార్టీలో అభ్యర్థుల కొరత ఉందని సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు. ఒక్కో స్థానానికి ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు టికెట్ కోసం పోటీ పడుతున్నారని చెప్పుకొచ్చారు. నాలుగున్న దశాబ్ధాలు పాలించిన కమ్యూనిస్టులను వెస్ట్ బెంగాల్ లో జీరో చేసిన చరిత్ర తమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించడం కేవలం బీజేపీతోనే సాధ్యమని రఘునందన్ రావు అన్నారు.

First published:

Tags: Raghunandan rao, Telangana bjp, Telangana Election 2018

ఉత్తమ కథలు