టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు (NT Rama Rao) జయంతి (birth anniversary) సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి (Centenary) ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారు.
భారతరత్న ఇవ్వాలని..
ఎన్టీఆర్కు టీఆర్ఎస్ నాయకులు (TRS leaders) మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించారు. తెలుగు ఖ్యాతి ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని వాఉ డిమాండ్ వినిపించారు. ‘‘ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్ (NTR)కు భారతరత్న ఇవ్వాలి”అని డిమాండ్ వినిపించారు.
శత జయంతి ఉత్సవాల్లో టీఆర్ఎస్ లీడర్లు
ఈ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉండాలనే ఆలోచన చేసిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేస్తామని చెప్పారు.
రాజకీయ విధానాన్ని మార్చేసిన మహానాయకుడు..
నివాళులర్పిస్తున్న జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. తెలుగు బిడ్డకు నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. దేశంలో తెలుగువారు ఎక్కడున్నా కీర్తి తెచ్చిపెట్టిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. సినిమా నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా చరిత్ర సృష్టించిన నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పారు. మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ.. భారతదేశంలో రాజకీయాలకు ఒక నూతన నిర్వచనం ఇచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి రావడమే కాకుండా.. రాజకీయ విధానాన్ని సమూలంగా మార్చేసిన మహానాయకుడని చెప్పారు. ‘‘భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్’’ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు.
ఇక, ఈ రోజు తెల్లవారుజామునే ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుని నివాళులర్పించారు. ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ కుమార్తెలు, కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్కు చేరకుని నివాళులర్పించారు. నందమూరి రామకృష్ణ, దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.