బీజేపీ ఎంఐఎంతో కలవచ్చు కదా...తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 113 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదని చురకలంటించారు. ఇతర పార్టీల వాళ్లు అంటరానివాళ్లనే భావన తమకు ఎప్పుడూ లేదన్నారు తలసాని.
news18-telugu
Updated: August 13, 2019, 5:27 PM IST

తలసాని శ్రీనివాస్ యాదవ్(File Photo)
- News18 Telugu
- Last Updated: August 13, 2019, 5:27 PM IST
తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ట్విటర్ వేదికగా అధికార పార్టీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తెలంగాణలో కల్వకుంట్ల వారి ప్రభుత్వమే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ కలిసిపోతోందని లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బీజేపీపై మంత్రి తలసాని యాదవ్ ఎదురుదాడికి దిగారు. ఎంఐఎంతో కలుస్తాన్నమంటూ తమపై విమర్శలు చేయడం ఎందుకని.. బీజేపీయే ఎంఐఎంతో కలవచ్చు కదా అని సెటైర్లు వేశారు.
ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్ కలిసిపోతోందని బీజేపీ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్పై విమర్శలు చేయడం ఎందుకు? హైదరాబాద్ పాతబస్తీలో బీజేపీ బలోపేతానికి ఎంఐఎంతో మీరే కలిసి వెళ్లొచ్చు కదా. పుల్వామాలో ఉగ్రదాడి జరిగినప్పుడు ఎంఐఎం పార్టీ మోదీకి మద్దతు తెలిపిందన్న విషయం మర్చిపోవద్దు.
ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు తలసాని శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 113 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదని చురకలంటించారు. ఇతర పార్టీల వాళ్లు అంటరానివాళ్లనే భావన తమకు ఎప్పుడూ లేదన్నారు తలసాని. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి మాట్లాడితే ప్రజలు ప్రశంసిస్తారని ఆయన సూచించారు. అంతేగానీ టీఆర్ఎస్పై విమర్శలు చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఎద్దేవా చేశారు.

— తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ మంత్రి
ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు తలసాని శ్రీనివాస్. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 113 స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదని చురకలంటించారు. ఇతర పార్టీల వాళ్లు అంటరానివాళ్లనే భావన తమకు ఎప్పుడూ లేదన్నారు తలసాని. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి మాట్లాడితే ప్రజలు ప్రశంసిస్తారని ఆయన సూచించారు. అంతేగానీ టీఆర్ఎస్పై విమర్శలు చేస్తే ఎలాంటి లాభం ఉండదని ఎద్దేవా చేశారు.