కరోనా మహమ్మారి దెబ్బకు మానవ జీవితం అస్తవ్యస్తమైంది. ఎక్కడికీ వెళ్లలేని.. ఏ వేడుకా చేసుకోలేని పరిస్థితులు దాపురించాయి. బర్త్డే, పెళ్లిళ్లతో పాటు ఏటా ఎంతో వైభవంగా జరుపుకునే పండుగలు కూడా కళ తప్పుతున్నాయి. ఇప్పటికే ఉగాది, శ్రీరామ నవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండగలను ఇళ్లలో ఉండే జరుపుకున్నారు. ఇక తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే ఆషాడ బోనాలను ఈసారి ఇళ్లల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది. బోనాల వేడుకలకు తెలంగాణ ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ నెల 25న గోల్కొండలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
గోల్కొండ బోనాల వేడుకల్లో 10 మంది మాత్రమే పాల్గొంటారు.
అన్ని దేవాయాల్లోనే ప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పిస్తుంది.
ఈసారి పూజారులు మాత్రమే ఆలయాల్లో బోనాలు నిర్వహిస్తారు.
గటాల ఊరేగింపునకు ఎలాంటి అనుమతి లేదు.
ప్రజలంతా తమ మొక్కులను ఇళ్లల్లోనే చెల్లించుకోవాలి.
ఉత్సవాలను టీవీలు, సోషల్ మీడియాల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
హైదరాబాద్లో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో 73శాతం కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఎప్పటిలానే నిర్వహిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశముందని ప్రభుత్వం భావించింది. బోనాలు, ఘటాల ఊరేగింపు వంటి కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొంటారని.. అలా జరిగితే కరోనా కేసులు మరింత ఎక్కువ అయ్యే అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి సూచించారు. ఈ నేపథ్యంలో బోనాల పండగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని జంట నగరాల ప్రజలకు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.