హోమ్ /వార్తలు /తెలంగాణ /

cm kcr : మరోసారి సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. రెండు రోజుల పాటు మకాం.. !

cm kcr : మరోసారి సీఎం కేసీఆర్ ఢిల్లీకి.. రెండు రోజుల పాటు మకాం.. !

ప్రధాని మోదీతో సమావేశం అయిన సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో )

ప్రధాని మోదీతో సమావేశం అయిన సీఎం కేసీఆర్ ( ఫైల్ ఫోటో )

cm kcr : ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మరోమారు ఢిల్లీ వెళ్లనున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ ఆదివారం రోజు నిర్వహించనున్న సమావేశంలో పాల్గొననున్న సీఎం ఇతర మంత్రుల కూడా సమావేశం కానున్నారు.

వారం రోజుల.. పాటు ఢిల్లీలో మాకం వేసిన.. సీఎం కేసీఆర్(cm kcr) మరోసారి ఢిల్లీకి(delhi) వెళ్లనున్నారు. రేపు శాసనసభ సమావేశాల్లోని(assembly) బీఏసీ భేటీ ముగిశాక బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఢిల్లీకి వెళ్లిన అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​తో కేసీఆర్ సమావేశమం కానున్నారు. ఆయనతో సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ(krishna ,Godavari revers) జలాల అంశాలు, నదీ యాజమాన్యబోర్డుల పరిధి నోటిఫికేషన్ సంబంధిత అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ చర్చించనున్నారు.

ఇక రెండవ రోజు ఆదివారం కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో సీఎం పాల్గొంటారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit shah)అధ్వర్యంలో నిర్వహించనున్న మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటిలో ఆయన పాల్గొంటారు.అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్​తో కేసీఆర్ సమావేశం కానున్నారు. ఆయనతో సమావేశంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై సీఎం చర్చిస్తారు. ఆదివారం సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్(Hyderabad) చేరుకుంటారు.

ఇది చదవండి : కూతురు అడ్మిషన్‌ కోసం స్కూల్‌కు వచ్చిన తల్లి.. కానీ అక్కడి హెడ్‌మాస్టర్ ఏం చేశాడంటే..


కాగా మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా...మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల సీఎంలు పాల్గొనే అవకాశం ఉంది.

భారత కమ్యూనిస్టు పార్టీ (cpi) (మావోయిస్టు) 17వ ఆవిర్భావ వారోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానుండగా.. ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే లేఖలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ ఈ నెల 26న ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది.

ఇది చదవండి : ఆంధ్రప్రదేశ్ లో వింత ఆచారం.. ఇలా పెళ్లి చేస్తే పంటలు బాగా పండుతాయంట..?


గత కొద్ది రోజుల క్రితమే దిల్లీ వెళ్లొచ్చిన కేసీఆర్​ ఢిల్లీ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేశారు. ఈ క్రమంలోనే అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్​.. పలు కార్యక్రమాల దృష్ట్యా వారం రోజుల పాటు ఉండిపోయారు. ఈ క్రమంలోనే 2వ తేదీన దిల్లీలో తెరాస కార్యాలయానికి కేసీఆర్​ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.భూమి పూజ అనంతరం 3న ప్రధాని మోదీ(PM NARENDRA MODI)తో సీఎం కేసీఆర్​ భేటీ అయ్యారు. సుమారు 50నిమిషాల పాటు మోదీతో సమావేశమైన కేసీఆర్​.. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు. ఈ సంధర్భంగా యాదాద్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రావాల్సిందినగా మోదీని కేసీఆర్ ఆహ్వానించారు. కాగా ఇరవై రోజుల్లోనే రెండుసార్లు సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: CM KCR, Delhi, Telangana

ఉత్తమ కథలు