హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ వరదలో కొట్టుకుపోయిన కాలేజీ లెక్చరర్‌ .. 24 గంటల తర్వాత ..

Telangana : కాలేజీ నుంచి ఇంటికి వెళ్తూ వరదలో కొట్టుకుపోయిన కాలేజీ లెక్చరర్‌ .. 24 గంటల తర్వాత ..

Teacher dies in flood

Teacher dies in flood

Sad news: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలు ప్రజల్ని భయపెట్టాయి. వనపర్తి జిల్లాలో కాలేజీ లెక్చర్‌ వాగు దాటుతున్న క్రమంలో వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. 24గంటల తర్వాత మత్స్యకారులు మృతదేహాన్ని గుర్తించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Wanaparthy, India

(Syed Rafi,News18,Mahabubnagar)అల్పపీడన ప్రభావం కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ (Mahabubnagar)జిల్లా వ్యాప్తంగా రెండ్రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వనపర్తి(Wanaparthy)జిల్లాలో కురిసిన వర్షానికి ప్రాణనష్టం సంభవించింది. జిల్లాలోని ఆత్మకూరు(Atmakuru ) పట్టణానికి చెందిన ఆకుల కురుమూర్తి (Akula Kurumurthi)అనే 37సంవత్సరాల వయసున్న ప్రైవేటు కాలేజీ లెక్చరర్‌ కొత్తకోట మండల కేంద్రంలోని నివేదిత ప్రైవేటు కాలేజీ(Private college)లో జూనియర్ లెక్చరర్(Junior lecturer) గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం కాలేజీ ముగియగానే కొత్తకోట నుంచి ఆత్మకూరుకు బయలుదేరారు. తన స్వగ్రామమైన ఆత్మకూర్‌కు బైక్‌పై వెళ్తుండగా మధురపురం రైల్వే గేటు పరిధిలోని ఉకా శెట్టి వాగు వంతెనపై వరద నీరు భారీగా ప్రవేశించడంతో వరద ధాటికి ఆకుల కురుమూర్తి ఉపాధ్యాయుడు జారిపడి వాగులో గల్లంతయ్యాడు.

Ganesh Nimajjanam 2022: వేలంలో భారీ ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ .. 24లక్షల 60వేలు దక్కించుకుంది ఎవరంటే



భారీ వర్షానికి ఒక ప్రాణం బలి..
విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న మదనాపురం పోలీసులు వాగు సమీపంలో గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బుధవారం కురుమూర్తి ఆచూకి కోసం ఎంతటి వెతికిన ప్రయోజనం లేకపోయింది. గురువారం ఉదయం మత్స్యకారులు చేపలు పడుతున్న సమయంలో గుర్తు తెలియని శవాన్ని గుర్తించారు. స్థానికులకు సమాచారం తెలియజేయడంతో పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. మృతదేహం దగ్గర రెడ్ హ్యాండ్ బ్యాగ్‌తో పాటు అందులో ఐడెంటీ కార్డును పరిశీలించారు. వాటి ఆధారంగానే మృతుడు ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ కురుమూర్తిగా నిర్ధారించారు.


వరదలో కొట్టుకుపోయిన లెక్చరర్..
విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేసిన మదనాపురం పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కురుమూర్తి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మంజునాథ్ రెడ్డి తెలిపారు. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపధ్యంలో ఎవరూ వంతెనలు, వాగులు దాటేందుకు సాహసం చేయవద్దని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.

First published:

Tags: Floods, Telangana News, Wanaparthi

ఉత్తమ కథలు