హోమ్ /వార్తలు /తెలంగాణ /

Chandrababu Naidu: కరీంనగర్‌కు చంద్రబాబు.. భారీ బహిరంగ సభకు టీడీపీ ఏర్పాట్లు..!

Chandrababu Naidu: కరీంనగర్‌కు చంద్రబాబు.. భారీ బహిరంగ సభకు టీడీపీ ఏర్పాట్లు..!

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ నెల 29న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలంగాణ (Telangana)పై కూడా ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో బలమైన నేతలు పార్టీ వెంట లేనప్పటికీ.. కేడర్ ఉన్నారని ఆయన నమ్ముతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లయినా సాధించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించిన ఆయన.. త్వరలోనే కరీంనగర్‌(Karimnagar)లో సభ పెట్టనున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మార్చి 29న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను టీడీపీ తలపెట్టిందని.. ఆ సభకు చంద్రబాబు కూడా వస్తారని తెలుస్తోంది.

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరపాలని తెలంగాణ టీడీపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ నెల 29న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా నాయకులు పట్టణంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంతో పాటు అంబేద్కర్ మైదానాన్ని పరిశీలించారు. ఈ రెండింటిలో ఒకటి ఖరరాయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వేదికను ఖరారు చేసిన తర్వాత.. టీడీపీ నేతలు సభా ఏర్పాట్లపై దృష్టిసారించనున్నారు.

 Pawan Kalyan : జనసేనకు ఒంటరి పోరే బెటరా.. ఏపీ ప్రజలు అదే కోరుతున్నారా

మొదట సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో ఆవిర్భావ వేడుకలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ భావించింది. ఆ సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలని అనుకున్నారు. నగరంలో ఏపీకి చెందిన వారు చాలా మంది ఉండడంతో.. వారంతా సభకు వస్తారని భావించారు. కానీ కంటోన్మెంట్‌ ఎన్నికలకు ఈ నెలలోనే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశముంది. ఒకవేళ నోటిఫికేషన్ వస్తే.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌లో ఆవిర్బావ సభ నిర్వహించాలనే ఉద్దేశంతో ఇక్కడి మైదానాలను పరిశీలించారు టీడీపీ నేతలు.

ఈ సభకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారని నాయకులు చెప్పారు. మరి కరీంనగర్‌లో సభను ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై మరో ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

First published:

Tags: Karimnagar, Local News, TDP, Telangana

ఉత్తమ కథలు