SIX MAOISTS KILLED IN A EXCHANGE OF FIRE IN THE FOREST AREA OF CHARLA MANDAL OF KHAMMAM DISTRICT SSR
Breaking: ఖమ్మం జిల్లాలో పోలీసులు, మావోల మధ్య కాల్పులు.. ఆరుగురు మావోలు మృతి
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలోని ఖమ్మం జిల్లా చర్ల మండలంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. స్పాట్లో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
ఖమ్మం: తెలంగాణలోని ఖమ్మం జిల్లా చర్ల మండలంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. స్పాట్లో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ-ఛత్తీస్గర్ సరిహద్దు ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. చర్ల మండలానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కురనవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి 7.30 మధ్య ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది.
ఈ ఎదురుకాల్పుల్లో చర్ల ఏరియా మిలీషియా కమాండర్ మధు మృతి చెందినట్లు సమాచారం. చనిపోయిన ఆరుగురు నక్సల్స్లో నలుగురు మహిళలు కూడా ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ గ్రేహౌండ్ పోలీసుల ఆపరేషన్లో భాగంగా ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది. చనిపోయిన మావోయిస్టుల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కాల్పులతో చర్ల మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Published by:Sambasiva Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.