
మోహన్ భగవత్(File Photo)
25వ తేదీ సా.5 గంటలకు సరూర్ నగర్ ఆడిటోరియంలో జరిగే సార్వజనిక ఉత్సవంలో కూడా భాగవత్ ప్రసంగిస్తారు.
ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర విజయ సంకల్ప శిబిరం ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్ శివార్లలోని భారత్ ఇంజినీరింగ్ కాలేజ్లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొంటారు. 25వ తేదీ సా.5 గంటలకు సరూర్ నగర్ ఆడిటోరియంలో జరిగే సార్వజనిక ఉత్సవంలో కూడా భాగవత్ ప్రసంగిస్తారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ శిబిరంలో శాఖ ముఖ్య శిక్షకులు పాల్గొననున్నారు. అన్ని వయస్సులవారు 3 రోజుల పాటు కలసి మెలసి ఆటపాటలతో పాల్గొంటారు. ప్రాంత సంఘచాలక్ బి దక్షిణామూర్తి, కార్యవాహ కె రమేష్ ఈ శిబిరం వివరాలను పత్రికా సమావేశంలో వివరించారు.
Published by:Krishna Adithya
First published:December 23, 2019, 23:01 IST