హోమ్ /వార్తలు /తెలంగాణ /

కాంగ్రెస్, టీడీపీ నేతలపై రేణుకా చౌదరి కంప్లైంట్... ఏమన్నారంటే...

కాంగ్రెస్, టీడీపీ నేతలపై రేణుకా చౌదరి కంప్లైంట్... ఏమన్నారంటే...

ఎన్నికల అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన రేణుకా చౌదరి

ఎన్నికల అధికారులకు కంప్లైంట్ ఇచ్చిన రేణుకా చౌదరి

Lok Sabha Election 2019 : తొలి దశ ఎన్నికలకు ముందు రోజున రేణుకా చౌదరి ఇచ్చిన కంప్లైంట్ కలకలం రేపుతోంది.

    Lok Sabha Election 2019 : ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రేణుకాచౌదరి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై ఇంతెత్తున లేచారు. ఈ వివాదాస్పద పోస్టులను పెడుతున్నది కాంగ్రెస్, టీడీపీ నేతలేనని ఆరోపించారు. పోస్టింగులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మం ఎన్నికల రిటర్నింగ్ అధికారితోపాటూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మరీ మరీ కోరారు. ఎన్నికల హడావుడిలో ఉన్న అధికారులు... సడెన్‌గా రేణుకా చౌదరి కంప్లైంట్ ఇవ్వడంతో... మిగతా పనులను పక్కనపెట్టి... దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది.


    ఎవరో ఎలా కనిపెడతారంటే : సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు ఎవరు పెట్టినా సైబర్ పోలీసులు ఇట్టే కనిపెట్టగలరు. ఎవరు ఏ పోస్టు పెట్టినా... ఏదో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ వాడక తప్పనిసరి. ప్రతీ ఇంటర్నెట్ కనెక్షన్‌కీ ఓ కోడ్ ఉంటుంది. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్. దీన్నే మనం IP అడ్రెస్ అంటున్నాం. ఐపీ అడ్రెస్ ఆధారంగా ఆ పోస్టులు మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వచ్చాయా లేక, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ కేఫ్ నుంచీ పోస్ట్ చేశారా అన్నది తెలిసిపోతుంది. తద్వారా వాళ్లను పట్టుకొని జైలుకు పంపడం తేలికే.


    ఇప్పుడు పోలీసులూ, అధికారులూ అందరూ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు. అందువల్ల రేణుకా చౌదరి కంప్లైంట్‌పై శుక్రవారం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి.


     


    ఇవి కూడా చదవండి :


    నేడే పోలింగ్... 20 రాష్ట్రాల్లో తొలి దశ ఎన్నికలు... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇవీ ప్రత్యేకతలు


    రన్ రాజా రన్ : మనవడితో ఎంజాయ్ చేస్తున్న చంద్రబాబు

    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Telangana Lok Sabha Elections 2019, Telangana News

    ఉత్తమ కథలు