డో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేశారని తెలిపారు. ఉద్యమ సమయంలో తాను పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని చెప్పారు. అడ్డదిడ్డం మాట్లాడే పార్టీ మాది కాదు. ప్రజలకు ఎవరు ఎంటో తెలుసు అన్నారు. సీఎం కేసీఆర్.తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు విద్యార్థులు చేశారు. బాధ్యతగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్పై ఒక బాధ్యతను పెట్టారు కాబట్టి ఆ భాద్యతలు నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు.
తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు
తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పారు. దీంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్నామని అన్నారు.. ఈ క్రమంలోనే గతంలో తెలంగాణ ఉద్యమంతోపాటు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి సీఎం ప్రస్తావించారు.శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ ప్రజలకే ఉద్యోగులు దక్కేటట్టు తీసుకువచ్చిన ఘనత మాదే అని చెప్పారు. దీంతో అటెండర్ స్థాయి నుండి అన్ని పోస్టులు 90 స్థానికులకే దక్కనున్నాయని ఆయన చెప్పారు. ఇదివరకు నాన్లోకల్ పోస్టుల పేరుతో ఆంధ్రవారికి ఉద్యోగాలు కట్టబెట్టారని అన్నారు. అయితే రాష్ట్ర సెక్రటేరియట్ లో మాత్రం ఐదు శాతం ఓపెన్ పోస్టులు పెట్టామని చెప్పారు. ఆంధ్ర వారు పెట్టిన పంచాయితీ ఇటివలే తెగాయని అన్నారు. పూర్తి స్థాయి అవగాహాన కూడా ఇటివలే వచ్చాయని అన్నారు. అందుకే 317 జీవో విడుదల చేశామని చెప్పారు. కాని దీనిపై తలతోక తెలియని కొన్ని పార్టీలు అనవసర ఆందోళన చేపట్టాయని విమర్శించారు. కాని ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయకుండా పూర్తి చేశామని చెప్పారు. ఉద్యోగాల సంక్షేమంపై తీసుకున్న అనేక చర్యలను ఆయన సభకు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.