రామగుండం కార్పొరేషన్ ఇప్పటికీ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న, జరిగేస్కాంలు మాత్రం ఆగడం లేదు.అభివృధ్దిజరగాల్సిన ప్రజల ధనం మొత్తం కొందరి జేబులో వెళ్తుంది. ఆ మొత్తాన్ని కాజేస్తున్నట్లు గానీ అనుమానాలు కూడా రాకుండా లీగల్ గా పేపర్ ఆధారాలు ఫోర్జరీ సంతకాలతో నడిపిస్తున్నారు. రామగుండం కార్పొరేషన్లో వెహికల్స్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలొస్తున్నాయి. విజిలెన్స్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేయడం హాట్టాపిక్గా మారింది.
హైదరాబాద్కు చెందిన డీఈఈ వినోద్, ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, మరో ఇద్దరు ఏఈలు కార్పొరేషన్ ఆఫీస్లో తనిఖీ చేశారు. పాత మున్సిపల్ ఆఫీస్, వెహికిల్స్ ను పరిశీలించారు. శానిటేషన్ రికార్డులు తనిఖీ చేశారు.గోల్మాల్ ఎలా జరిగిందంటే..రామగుండం కార్పొరేషన్లో శానిటేషన్ పనుల కోసం వివిధ వాహనాలు తీసుకున్నారు. రూ.88 లక్షల పట్టణ ప్రగతి నిధులు, రూ.6.25 కోట్ల 14వ ఫైనాన్స్ ఫండ్స్నుంచి 50 స్వచ్ఛ ఆటో ట్రాలీలు, ట్రక్ మౌంటెట్ గార్బేజ్ కాంపాక్టర్లు, 11 వేల లీటర్ల కెపాసిటీ గల కాంపాక్టర్ బిన్లు, ట్రక్ మౌంటెడ్ రోడ్ స్వీపింగ్ మిషన్, లిట్టర్ పిక్కర్, శ్మశాన వాటికలు, రెండు పొర్టబుల్ కాంపాక్టర్లు, ఒక ఎక్స్కావేటర్, బాబ్కార్డు, రాడింగ్ మిషన్ కొనుగోలు చేశారు.
వీటిని 2020 జూన్ నుంచి 2021 ఏప్రిల్ మధ్య కాలంలో టీఎస్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసినట్టు రికార్డు చేశారు. ఎలాంటి అగ్రిమెంట్లు, ఎంబీ రికార్డులు లేకుండానే టీఎస్ ఆగ్రో సంస్థ ఇన్వాయిస్లపై బిల్లులు క్లెయిమ్ చేశారు.
ఏడాది దాటినా ఇందులో రూ.24.26 లక్షలతో ఎక్స్కావేటర్ కొనుగోలు చేసి 2021 ఏప్రిల్ 24న బిల్లు చెల్లింపు, రూ.1.34 కోట్లతో రాడింగ్ మిషన్, రెఫ్యూజ్ కంపాక్టర్, బాబ్ కార్డు మిషన్ కొనుగోలు చేసి 2021 జూన్ 30న బిల్లులు చెల్లించారు కానీ ఈ వెహికిల్స్ ఇప్పటికీ రామగుండం కార్పొరేషన్కు చేరలేదు. కొనుగోలు చేసిన వెహికిల్స్ను మార్కెట్ రేట్ కంటే 30 నుంచి 40 శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు ఆరోపణలున్నాయి.
కొన్న వాహనాలు మూలకి కానీ వాటి బిల్లు జేబులకు..కార్పొరేషన్లో టీఎస్ ఆగ్రో సంస్థ ద్వారా కొనుగోలు చేసిన వెహికిల్స్లో చాలా వరకు మూలకే పడ్డాయి.
రూ.45 లక్షలతో కొనుగోలు చేసిన సీవరేజ్ జెట్టింగ్ మిషన్ ఇటీవలే రిపేర్కు నోచుకుంది. దీని స్పేర్పార్ట్స్ ఢిల్లీలోనే దొరుకుతుండడంతో మూలకు పడేశారు. ఇక రూ.1.05 కోట్లతో కొనుగోలు చేసిన స్వీపింగ్ మిషన్, రూ.23.49 కోట్లతో కొనుగోలు చేసిన లిట్టర్ ఫిక్కింగ్ మిషన్ కదలడంలేదు. పేరుకే ఆగ్రోస్ ఉన్నప్పటికీ మధ్యవర్తులు సుమారుగా రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు వెనకేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
విజిలెన్స్ ఏమిచెప్తుందో...విజిలెన్స్ అధికారులు ముమ్మరంగా తనిఖీ చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే వాహనాల కుంభకోణం పై ఎటువంటి విషయాలు అయితే బయటకు రాలేదు డీజిల్ పెట్రోల్ కుంభకోణం పై కూడా తనిఖీ పై విషయాలు తెలియాల్సి ఉంది.కుంభకోణం లో ఎవరు ఉన్నారు ఎలా చేశారు,ఫోర్జరి చేసింది ఎవరు అన్ని వివరాలు కూడా విచారణ తరువాత వెలువడనుంది..
కుంభకోణంలో ఉన్నవారిని శిక్షించాలి..
లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సృష్టించి అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ పార్టి నాయకుడు మద్దెల దినేష్ అన్నాడు,రామగుండం కార్పొరేషన్ లో వెహికిల్ కుంభకోణం,డీజిల్ దోపిడీ వంటి వాటిపై పటిష్టంగా సీబీఐ విచారణ చేయాలని నిజ నిర్ధారణ చేసి తప్పు చేసిన వారికి శిక్షించాలి అని వారు అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Peddapalli, Telangana