ONCE UP ON A TIME THERE WAS NAXALISM BUT NOW FULL OF PATRIOTISM IN A VILLAGE VRY
Siddipet : అప్పుడు నక్సలిజానికి పునాది ఆ ఊరు.. నేడు దేశభక్తితో నిండిపోయింది. కారణం ఇదే..
ఫైల్ ఫోటో
Siddipet : ఒకప్పుడు నక్సలిజం రాజ్యమేలితే ఇప్పుడు దేశ భక్తితో ఆ గ్రామం ఊగిపోతుంది.. దేశం కోసం తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎంతో మంది అసువులు బాసిన చరిత్ర పునరావృతం అవుతోంది. ఇంతకి ఆ గ్రామం అలా ఎందుకు మారింది.
ఒకప్పుడు స్థానిక ప్రజల కోసం తుపాకులు పట్టిన యువకులు ఇప్పుడు దేశం కోసం తుపాకులు పట్టారు.. అయితే అప్పుడు రాజ్యానికి వ్యతిరేకంగా తుపాకులను మోగిస్తే.. తాజాగా ఇప్పుడు దేశానికి శత్రువులుగా ఉన్న మూకలపై తుపాకులు పేల్చుతున్నారు. ఇలా ఆ గ్రామం నక్సలిజం నుండి దేశభక్తి వైపు ఓ గ్రామం మళ్లింది. ఇప్పుడు ఆ గ్రామంలో వందలమంది దేశ సరిహద్దుల మధ్య ఉంటూ ఎంతోమంది తమ ప్రాణాలను సైతం వదిలారు.. దీంతో ఆ గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తోంది.
ఆ గ్రామం అంటే ప్రజలకు భయం వేసేది . పిపుల్స్ వారు ఎక్కువగా ఉండే గ్రామం ఎప్పుడు ఏం జరుగుతుందోనని తెలియని పరిస్థితి ఆలాంటి గ్రామం ఇప్పుడు దేశా సరిహద్దుల్లో వందకు పైగా యువకులు విధులు నిర్వహిస్తున్నరు. వారి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లుగా విధులు నిర్వహించి వారి గ్రామం రాష్ట్రంలో నే ఆదర్శంగా నిలుస్తుంది.
సిద్దిపేట జిల్లా అక్కనపేట్ మండలం కట్కూర్ గ్రామంలో వంద మంది పైగా యువత ఉగ్రవాదుల దాడులలో వీరమరణం పొందిన వారే .యువత పట్టు వదలకుండా ఎంతోమంది చనిపోయిన తర్వాత 25 మంది ఆర్మీ లో చేరి దేశభక్తి తో పాటు ఆ కట్కూర్ గ్రామనికి ధైర్యాన్ని తెచ్చారు.ప్రస్తుతం130 మంది యువత సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా కట్కూర్ గ్రామంలో 40 సంవత్సరాల క్రితం జేర్రి పోతుల డేనియల్ ఆర్మీ లో జవానుగా చేరాడు.ఆయన స్పూర్తితో ఎంతో మంది యువకులు దేశరక్షణలో భాగస్వామ్యులవుతున్నారు .
కాగా ఆ గ్రామంలోని కట్కూరు గ్రామ పరిధిలోని రాజు చెందిన గిరిజన యువకుడు నరసింహ నాయక్ మిలటరీ లో జవానుగా పనిచేస్తూ తీవ్రవాదుల జరిపిన కాల్పుల్లో వీరమరణం పొందాడు. చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో 2014లో తీవ్రవాదులకు సైనికుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నరసింహ నాయక్ మృతి చెందాడు. ఈ ఘటన తర్వాత గ్రామంలో తీవ్ర విషాదం అలుముకున్న ఆ గ్రామం యువత మనోధైర్యాన్ని మాత్రం వీడలేదు. ఆయన మరణనంతరం గ్రామానికి చెందిన యువకులు ఆర్మీ లో చేరడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ఇలా 40 నుంచి 50 మంది జవాన్లు నెలరోజుల సెలవుపై వచ్చి సంవత్సరంలో ఒకసారి వచ్చి వెళుతూ ఉంటారు. ఆ సమయంలో ఇక్కడ యువతకు సలహాలు సూచనలు ఇస్తారు. దీంతో మిగిలిన యువత సైతం ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆ గ్రామంలోని వందలాది మంది వెళుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.
.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.