హోమ్ /వార్తలు /telangana /

Minor Girl Rape : కలెక్టరెట్‌లో కామాంధుడు .. టెన్త్ విద్యార్ధినిపై రెండేళ్లుగా అత్యాచారం ఎక్కడంటే..?

Minor Girl Rape : కలెక్టరెట్‌లో కామాంధుడు .. టెన్త్ విద్యార్ధినిపై రెండేళ్లుగా అత్యాచారం ఎక్కడంటే..?

MINOR GILRL RAPE

MINOR GILRL RAPE

Crime news: నైన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్దినిపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. మైనర్ బాలికను ఇంట్లో చెప్పకుండా బాసర తీసుకెళ్లి తన కోరిక తీర్చుకున్నాడు. కంగారుపడిన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టడంతో కామాంధుడి గుట్టురట్టైంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nizamabad, India

(P.Mahendar,News18,Nizamabad)

కామారెడ్డి Kamareddy జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సెక్యురిటీ గార్డ్‌Security Guardగా విధులు నిర్వహిస్తున్న యువకుడు కామాంధుడి అవతారమెత్తాడు. ఆఫీసు దగ్గరలో నివసిస్తున్న టెన్త్ క్లాస్ స్టూడెంట్‌(Student)ని ట్రాప్ చేశాడు. మాయమాటలు చెప్పి రెండేళ్లుగా మైనర్‌ బాలిక(minor girl)పై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. బాలిక అనారోగ్యానికి గురి కావడంతో అసలు విషయం బయటపడింది. కలెక్టర్ ఆఫీసు(Collectorate)లో ఉండేవాడ్ని పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు పోలీసులు(Police).

Corruption : ఆ శాఖలో అవినీతిపరులకు కొదవే లేదా ..? భూమి పోగొట్టుకున్న బాధితుల గోడు ఆలకించేదెవరూ మరి



కలెక్టరెట్‌లో కామాంధుడు..

కామారెడ్డి జిల్లాల్లో రెండేళ్లుగా ఓ మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు కిరణ్‌ అనే .యువకుడు. జిల్లా కలెక్టరెట్‌లో సెక్యురిటీ గార్డ్‌గా పనిచేస్తున్న కిరణ్‌ పట్టణంలోని గోసంగి కాలనీలో నివాసముంటున్న టెన్త్ క్లాస్ విద్యార్దినికి మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఇంట్లో బాలిక తల్లిదండ్రులు ఎవరూ ఉండకపోవడం గమనించి ఆమెపై గత రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈమధ్యనే బాధితురాలు టెన్త్ పూర్తి చేసింది. ఈనెల 7వ తేదిన బాధితురాలితో పాటు ఆమె ఇద్దరు చెల్లెళ్లలను బాసర తీసుకెళ్లాడు నిందితుడు. అక్కడే టెన్త్ విద్యార్దినిపై మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు.

టెన్త్ విద్యార్ధినిపై అత్యాచారం..

ఇంట్లో ఉండాల్సిన ముగ్గురు కుమార్తెలు రాత్రి అయినప్పటికి ఇంటికి రాకపోవడంతో తండ్రి సాయిలు ఆందోళనకు గురై పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నా పోలీసులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. తెల్లవారు జామున ముగ్గురు కుమార్తెలు ఇంటికి రావడంతో బాధితురాలి తండ్రితో పాటు గ్రామస్తులు మర్చిపోయారు. ఇంటికి వచ్చిన ముగ్గురు కుమార్తెల్లో రెండో కుమార్తె కడుపునొప్పి వస్తోందని తల్లికి చెప్పింది. బాధితురాలిని కుటుంబ సభ్యులు గట్టిగా ప్రశ్నించడంతో నిందితుడు కిరణ్‌ తనపై రెండేళ్లుగా అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలిపింది. బాధితురాలి కుటుంబ సభ్యులు కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అత్యాచారం చేసినట్లుగా అంగీకరించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లుగా ఎస్‌హెచ్‌ఓ నరేష్ తెలిపారు.

Cyber Crime : సైబర్‌ నేరగాళ్ల వలలో పడకుండా ఉండాలంటే ..సిద్దిపేట పోలీసులు చెప్పినట్లు చేస్తే చాలు



రెండేళ్లుగా సాగుతున్న అరాచకం..

పదవ తరగతి చదువుతున్న బాలిక తల్లిదండ్రులు గుమస్తా కాలనీలో హోటల్‌ నడుపుకుంటూ బిడ్డల్ని చదివిస్తున్నారు. నలుగురు ఆడపిల్లలే కావడంతో పెద్ద కుమార్తె వివాహం చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంట్లో ఉంచి హోటల్ వ్యాపారం చేసుకునేందుకు వెళ్లడం వల్లే ఇంతటి దారుణం జరిగినట్లుగా పోలీసుల ఎంక్వైరీలో తేలింది. పోలీసులు ఆడపిల్లల్ని ఇంటి దగ్గర ఒంటరిగా వదిలిపెట్టిన సమయంలో వారి జాగ్రత్తలు, రక్షణపై కూడా దృష్టి పెట్టాలని తల్లిదండ్రులకు సూచించారు పోలీసులు.

First published:

Tags: Kamareddy, Minor girl raped, Telangana crime news

ఉత్తమ కథలు