తన అంగవైకల్యం అడుగడుగునా అడ్డుకుంటున్న వాటిని అధిగమిస్తూ లక్షాన్ని సాధించాడు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామాలయం ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. 5వ తరగతి విద్యార్థులకు తెలుగు, సాంఘికం, సామాన్యం వంటి పాటలను బోధిస్తున్నారు. బ్రెయిలీలిపి ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక పుస్తకాల సహకరంతో పిల్లలకు పాఠాలను అర్థమయ్యేలా ఇంగ్లీషులో బోధనలు చేపడుతున్నారు.
ఇది చదవండి: విలువిద్యలో రాణిస్తున్న కిన్నెరసాని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
బ్రెయిలీ లిపి ద్వారా పాఠాలు
బ్రెయిలీ లిపి ద్వారా తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో పాఠాలు చెప్తానని వివరించారు. తాను వ్యక్తిగత జీవితంలో నేటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. సమాజం చులకనగా చూడటం లేదా జాలి పడడం వంటివి చేయడం వలన ఇబ్బందికరంగా ఉంటుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ తమ అంగవైకల్యాన్ని సమాజం ఎప్పుడు వేలెత్తి చూపుతూనే ఉంటుందని వివరించారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
సమాజంలో మార్పు వస్తేనే అంగవైకల్యం ఉన్నవారు ఆత్మవిశ్వాసంతో మరింత ముందుకు వెళ్లగలరని సూచించారు. అంగవైకల్యం నిత్యం వేధిస్తున్నప్పటికీ తన కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారంతో తన సాధారణ జీవితాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడిపేస్తున్నానని తెలుపుకొచ్చారు.
కలలు వస్తుంటాయి
తనకు అప్పుడప్పుడు కలలు వస్తుంటాయని ఆ కలలో వ్యక్తుల మాటల తప్ప ఆకారం కనిపించదని తెలిపారు. చిన్నతనం నుంచి ఎలాంటి చూపును నోచుకోలేదు కాబట్టి కేవలం వ్యక్తుల మాటలు మాత్రమే వినిపిస్తాయని ఎలాంటి ఆకారం కానీ రంగులు కానీ కనిపించని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కొత్త నోట్లను అమలులోకి తీసుకురావడం అంధులకు ఇబ్బందిగా మారిందని వివరించారు.
కరెన్సీ నోట్లు గుర్తించలేకపోతున్నాం
ప్రస్తుతం ఉన్న కొత్త నోట్లు అన్ని దాదాపుగా ఒకే సైజు ఉండడం వల్ల వాటిని గుర్తించడం కాస్త ఇబ్బందికరంగా మారిందని చెప్పుకొచ్చారు. వీటిపై నేషనల్ బ్లైండ్ అకాడమీ వాళ్లు ఢిల్లీలో పోరాటం చేపడుతున్నారని అందరికీ అందుబాటులో ఉండే విధంగా నోట్లను ముద్రించాలని చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Nagarkarnol district, Telangana