హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mulugu Couple: ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు.. ఇప్పుడు మాత్రం ఆదర్శ దంపతులు

Mulugu Couple: ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు.. ఇప్పుడు మాత్రం ఆదర్శ దంపతులు

X
నవీన్,

నవీన్, స్రవంతి దంపతులు

ఒకప్పుడు అజ్ఞాతంలో ఉన్న ఆ దంపతులు... ప్రజల కోసం దళంలో ఉండి పోరాటం చేశారు. రెండు దశాబ్దాల క్రితం మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులుగా హిట్ లిస్టులో ఉండేవారు. కానీ అదంతా గతం.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Warangal, India

Venu, News18, Muluguఒకప్పుడు అజ్ఞాతంలో ఉన్న ఆ దంపతులు... ప్రజల కోసం దళంలో ఉండి పోరాటం చేశారు. రెండు దశాబ్దాల క్రితం మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులుగా హిట్ లిస్టులో ఉండేవారు. అడవుల్లో జరిగిన అనేక దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాడు అతను. అగ్ర నాయకులకు గార్డుగా వ్యవహరించాడు. కొత్తగా అజ్ఞాతంలో వచ్చిన వారికి మిలటరీ ట్రైనింగ్ ఇవ్వడంలో అతను దిట్ట. ఇతని ఆధ్వర్యంలో ఎందరో దళంలో చేరిన ఆరితేరేవారు. ఆమె విప్లవ పాటలతో అనేక మందిని దళంలోకి ఆకర్షించింది. వీరిద్దరూ ఒక్కటయ్యారు. రోజులు గడిచిన కొద్ది వారి ఆలోచనలు మారాయి. ఈ పోరాటాల ద్వారా సాధించేది ఏమి లేదని గ్రహించారు. జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల మధ్య ఉంటూ బడుగు బలహీన గిరిజనుల కోసం అండగా నిలుస్తున్నారు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కొప్పుల బక్కయ్య అలియాస్ నవీన్ కొప్పుల సరిత వీరి జీవితం పై న్యూస్ 18 ప్రత్యేక కథనం.
తెలంగాణ (Telangana) లోని ములుగు జిల్లా (Mulugu District) తాడ్వాయి మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన కొప్పుల బక్కయ్య విప్లవాలకు ఆకర్షితుడై బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేయాలనీ దళంలో చేరాడు. కాలువపల్లి గ్రామం నుంచి అనేక మంది వ్యక్తులు అజ్ఞాతంలో పెద్ద క్యాడర్‌గా వ్యవహరించిన వారు ఉన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని బక్కయ్య బడే నాగేశ్వరరావు అలియాస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో అజ్ఞాతంలోకి వెళ్లి పోరాటం మొదలు పెట్టాడు. బక్కయ్య అలియాస్ నవీన్... దళంలో ఒక సాధారణ మావోయిస్టు నుంచి జిల్లా కేడర్లో విధులు నిర్వహించి అగ్ర నాయకులకు సైతం గార్డుగా వ్యవహరించాడు. నిరుపేద రైతుల కోసం గిట్టుబాటు ధర చెల్లించడం, పోడు భూములపై హక్కులు సాధించడం కోసం చేసిన పోరాటంలో బక్కయ్య అలియాస్ నవీన్ తనదైన ముద్రను వేసుకున్నాడు. దాదాపు ఐదు లైవ్ ఎన్‌కౌంటర్ల నుంచి బక్కయ్య అలియాస్ నవీన్ తృటిలో తప్పించుకున్నాడు.

ఇది చదవండి: పెట్టుబడి తక్కువ.. రాబడి ఎక్కువ.. రైతు ఐడియా అదిరిపోలా..! మీరూ తెలుసుకోండి..


మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నవీన్ అలియాస్ బక్కయ్యతో న్యూస్ 18 మాట్లాడగా "వ్యక్తులను చంపడం మావోయిస్టుల సిద్ధాంతం కాదు. కేవలం సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వంతో పోరాటం చేయడమే అప్పట్లో మా ప్రధమ కర్తవ్యంగా ఉండేది. పోలీసులకు మావోయిస్టులకు జరిగే ఎదురు కాల్పుల్లో ఒకరికొకరు ప్రత్యక్షంగా శతృత్వం లేకపోయినప్పటికీ విధి నిర్వహణలో కాల్పులు జరపడం, ఇరు వర్గాలలో ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మనతో విధి నిర్వహణ చేసిన వ్యక్తి రణరంగంలో మరణించడంతో పోలీసులకైనా, నక్సలైట్లకైనా ఎదుటివారిని చంపేయాలనేంత కోపం వస్తుంది" అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చాడు బక్కయ్య.

ఇది చదవండి: ప్రయోగాల ద్వారా పాఠాలు.. ఇటువంటి మాస్టారు ఉంటే ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారమే


నవీన్ సతీమణి కొప్పుల సరిత సొంత ఊరు భూపాలపల్లి. చిన్నతనంలోనే విప్లవ గేయాలకు ఆకర్షితురాలైన సరిత విప్లవ గేయాలను పాడుకుంటూ అజ్ఞాతంలోకి వెళ్ళింది. వీరిద్దరికీ మావోయిస్టు అగ్రనేతలు వివాహం నిశ్చయించారు. వివాహం జరిగిన అనంతరం ఎవరి విధులు వారు నిర్వహించేవారు. కొత్త కాలం తర్వాత నవీన్ ఆరోగ్యం సహకరించలేదు. దీంతో అగ్ర నాయకత్వానికి సమాచారం అందించి జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు దంపతులు 2008లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.


జనజీవన స్రవంతిలో కలిసిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు దంపతులకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇద్దరిని చూస్తే భయంతో ఎవరు మాట్లాడేవారు కాదు. బయటికి వచ్చిన అనంతరం ఏం చేయాలో తెలియక చాలా రోజులు ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం అందలేదు. లొంగిపోతే ఇస్తామన్న మూడు ఎకరాల భూమి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎలాంటి జీవనాధారం లేక రోజువారి కూలీ పనులకు వెళ్తున్నారు. కొప్పుల సరిత ములుగు జిల్లా తుడుం దెబ్బ మహిళా అధ్యక్షురాలిగా గిరిజనులకు సేవలు చేస్తు ఆదర్శంగా నిలుస్తుంది.

First published:

Tags: Local News, Maoist, Mulugu, Telangana

ఉత్తమ కథలు