హోమ్ /వార్తలు /తెలంగాణ /

Big News: ఎమ్మెల్యేల ఎర కేసు..ప్రభుత్వ పిటీషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా!

Big News: ఎమ్మెల్యేల ఎర కేసు..ప్రభుత్వ పిటీషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..విచారణ వాయిదా!

తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో)

తెలంగాణ హైకోర్టు (ఫైల్ ఫోటో)

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAa Poaching Case)లో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (MLAa Poaching Case)లో ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటీషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)లో విచారణ జరిగింది. ఈ విచారణలో భాగంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటీషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అనుమతి తీసుకొని రావాలని సింగిల్ బెంచ్ పేర్కొంది. ఇక ఈ కేసుపై సీబీఐ FIR నమోదు చేసిందా అని హైకోర్టు ప్రశ్నించగా ఇంకా నమోదు చేయలేదని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ తెలిపారు. ఎమ్మెల్యేల కేసు బదిలీ కోసం 3 సార్లు ప్రభుత్వానికి లేఖ రాసిన స్పందించలేదని డిప్యూటీ సోలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు.

Babu Mohan: బండి సంజయ్ ఎవడ్రా..కార్యకర్తపై బూతులతో రెచ్చిపోయిన బాబూ మోహన్..ఆడియో వైరల్

మరోవైపు సీబీఐ (CBI) కేసు నమోదు చేయాలని, ఫైల్స్ అప్పగించాలని ఒత్తిడి తెస్తుందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇక సుప్రీంకోర్టు వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు (High Court) ప్రశ్నించగా వారం రోజులు పడుతుందని ఏజి తెలిపారు. పిటీషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి అని కోర్టు పేర్కొంది రేపు ఉదయం చీఫ్ జస్టిస్ ముందు అనుమతి కోరుతామని ఏజీ పేర్కొన్నారు. దీనితో తదుపరి విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. కాగా నిన్న ఈ కేసు సీబీఐ విచారణకు హైకోర్టు డివిజన్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

PM Modi: బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం..ఆ అంశాలపై ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

ఎమ్మెల్యేల కొనుగోలు (MLAa Poaching Case) కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మొదట ఈ కేసును సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సీబీఐ (Central Burew Of Investigation) కి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు (Telangana High Court) సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే సీబీఐ  (Central Burew Of Investigation) విచారణ అవసరం లేదని ప్రభుత్వం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ అప్పీల్ పై విచారణ జరిపిన కోర్టు నిన్న కీలక తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలో ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని అంతా భావించగా..లంచ్ మోషన్ కు హైకోర్టు అనుమతించడంతో ఏజీ పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

కాగా రేపు మరోసారి విచారణ జరుపనున్న కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: Telangana, Telangana High Court, Telangana News, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు