( న్యూస్ 18 మహబూబ్ నగర్ సయ్యద్ రఫీ.... )
మంత్రి కేటిఆర్ గత కొద్ది రోజులుగా జిల్లాల్లో పర్యటనలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం, కోడుగల్ గ్రామంలో సుమారు రెండు కోట్ల 10 లక్షల రూపాయలతో నిర్మించిన (40 )రెండు పడకల గదులను ప్రారంభించారు. దీంతో పాటు రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇళ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. గతంలో ఇల్లు అంటే అగ్గిపెట్టె సైజులో ఉండేవని ,అందులోనే కుటుంబ సభ్యులందరూ బ్రతకాల్సి వచ్చేదని, అలా కాకుండా తమ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్లు ఖర్చు చేసి 2 లక్షల 70 వేల ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఎన్నో అద్భుత పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు..
,మా తండాలో మా రాజ్యం అనే గిరిజనుల దశాబ్దాల కల నెరవేర్చి తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామంలో రోడ్లు, చెట్లు, పారిశుద్ధ్యం, రైతు వేదిక ,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ట్రాక్టర్, ట్యాంకర్ ఏర్పాటు చేయడమే కాకుండా, ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేయడం ,ప్రతి పల్లెటూర్లో పట్నం లో లాగా ఆట స్థలాలు ఏర్పాటు చేసి గ్రామాలకు నిజమైన గ్రామస్వరాజ్యం తీసుకువచ్చామని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పల్లెటూర్లు ఉన్నాయని, రాష్ట్రంలోని 12769 గ్రామ పంచాయతీలలో నర్సరీ, ట్రాక్టర్, ట్యాంకర్లు ఉన్నాయని, ప్రతి ఊరికి ముందు చెట్లు స్వాగతం పలుకుతున్నాయని, మిషన్ భగీరథ తాగునీరు ,టాయిలెట్లు, రైతుబంధు, రైతు వేదిక వంటి పథకాలను అమలు చేయడమే కాకుండా, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు.
Khammam : ఆ మాజీ మంత్రికి బుజ్జగింపులు.. తెరాస అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటో..?
ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీటిని ఇస్తున్నామని, ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వల్ల రెండు లక్షల మంది జీవచ్ఛవంగా మారారని,తాము తెచ్చిన మిషన్ భగీరథ నీటి వల్ల నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆసరా పెన్షన్లు ఇస్తున్నాయని,సన్న బియ్యంతో దళిత, గిరిజన, గిరిజన వెనుకబడిన వారికి పిల్లలకు హాస్టల్లో భోజనం ఏర్పాటు చేశామని, 1000 గురుకులాలు ఏర్పాటు చేసి సుమారు ఐదు లక్షల మంది పిల్లలు ప్రైవేటు పాఠశాలల పిల్లల తో పోటీ పడే లాగా చదివిస్తున్నామని, 16 వేల కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చామని ,అంబేద్కర్ ఓవర్ సీస్ విద్యానిధి కింద 20 లక్షలు, జ్యోతిబాపూలే విద్య నిధి కింద 20 లక్షల అందిస్తున్నామని, ఇలాంటి అద్భుత పథకాలు ఏ రాష్ట్రంలో లేవని అన్నారు.
Murder : పెళ్లింట విషాదం... పెళ్లి కోసం వచ్చిన మేనమామపై గొడ్డలితో దాడి చేసి చంపిన తండ్రి...
కేంద్ర ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల కు జాతీయ హోదా కల్పిస్తామని ఇవ్వలేదని, ఐటీ కారిడార్ కోరినప్పటికీ రాష్ట్రానికి ఇవ్వలేదని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వనరులతో నిర్విఘ్నంగా ముందుకు వెళుతున్నదని ,పేద ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని,పేద ప్రజల కళ్ళల్లో సంతోశం కలిగే వరకు విశ్రమించబోమని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KTR, Mahabubnagar