MANJA THREAD A KITE THAT HIT THE YOUNG MAN NECK WHILE RIDING A TWO WHEELER AND SEVERE BLEEDING IN KAMAREDDYY NZB PRV
Nizamabad: ద్విచక్రవాహనంపై వెళుతుండగా యువకుడి మెడకు తగిలిన పతంగి మాంజా.. తీవ్ర రక్తస్రావం..
ఆసుపత్రిలో యువకుడు
తెలంగాణలో సంక్రాంతి అంటే కైట్స్ ఎగరేయడం. వాటికి వాడే దారం మంచిది కావాలని డబ్బులు పెట్టి విలువైన మాంజా (దారం) కొంటారు. అయితే మాంజా తో అపశృతి దొర్లింది.
సంక్రాంతి పండుగ (Sankranti festival) అంటేనే తీపి.. పిండి వంటలు.. పతంగులు ఎగరేయడం ప్రత్యేకత. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా కేరింతలు కొడుతూ పిండివంటలు తింటూ స్వేచ్ఛగా గత మూడు రోజుల పాటు సంబురాలు జరుపుకుంటారు. తెలంగాణ (Telangana)లో సంక్రాంతి అంటే కైట్స్ ఎగరేయడం. వాటికి వాడే దారం మంచిది కావాలని డబ్బులు పెట్టి విలువైన మాంజా (దారం) కొంటారు. అయితే మాంజా (Manza) తో అపశృతి దొర్లింది. పతంగ్ మాంజా కారణంగా ఓ వ్యక్తి గొంతు తెగింది. దీంతో ఆ వ్యక్తిక తీవ్ర రక్త స్రావం అయ్యింది. మెయిన్ రోడ్డు మీద బైక్ పై వెలుతుండగా కామారెడ్డి (Kamareddy) జిల్లాలో ఈ ఘటన జరిగింది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని షేక్ సన్ హోటల్ ఎదురుగా మెయిన్ రోడ్ పై వెళ్తున్న ఇస్లాంపూర్ చెందిన మహమ్మద్ ఏజ్ కు పతంగి మాంజా గొంతు (Throat)కు తగిలి తీవ్ర గాయం అయింది. బైక్ పై వెళుతుండగా ఈ జరిగిన ఘటన జరిగింది. సంక్రాంతి సందర్భంగా బిల్డింగ్ పై నుంచి పతంగులు ఎగర వేస్తుండగా ఓ పతంగి దారం అతనికి తగిలి ఘటన చోటుచేసుకుంది. ఆ వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యువకుడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడ్డాడు.. చికిత్స పొందుతున్నాడు.
ఈ మాంజ కారణంగా పక్షులకు కూడా హాని కలుగుతుంది. పతంగిలకు చైనా మాంజా వాడటంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గతంలోనే ప్రభుత్వం నిషేధం విధించింది. ఇలాంటి మాంజాలు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లలు కూడా పతంగి ఎగరేసినప్పుడు చేతులు తెగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గతంలో ఈ పతంగులను (Kites) ఎగరేసేందుకు కాటన్ మాంజాను వాడేవారు. పోటీ పెరగడంతో మాంజా దారానికి గాజు పిండి, సాబుదానా, గంధకం, రంగులు వేసి మాంజాను తయారు చేసేవారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ప్రమాదకరమైన చైనా మాంజా రాజ్యమేలుతోంది. రసాయనాలు పూసిన ఈ మాంజాతో పక్షులు, మనుషులకు కూడా ముప్పు వాటిల్లు తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూలై 11న నిషేధం విధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 ప్రకారం అమ్మినా, కొనుగోలు చేసినా నేరమే. చైనా మాంజాను అమ్మితే ఏడేళ్ల జైలు, 10 వేల రూపాయలు జరిమానా విధిస్తారు. అయినా ఇప్పటికీ నగర మార్కెట్లో చైనా మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.