(Syed Rafi, News18,Mahabubnagar)
నీళ్లు, నిధులు, నియామకాలని ఉద్య మ సమయంలో వేదికలెక్కి ఉత్తర ప్రగల్బాలు పలికిన సీఎం కేసీఆర్ , రాష్టం ఏర్పడి అనంతరం అధికారంలోకి వచ్చి న తర్వాత ఉద్యమ స్ఫూర్తికి మంగళం పాడి, అవినీతి, అక్రమాలకు పెద్ద పీట వేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ అన్నారు. కేవలం తొమ్మిదేళ్ల పాలనలో రూ.5 లక్షల కోట్ల మేర అప్పులు చేశాడని ఆరోపించారు. రాష్టం ఏర్పడ్డ తొలినాళ్లలో మిగులు బడ్జెట్ ఉందని,కే సీఆర్ పుణ్యమా అని నేడు రాష్ట్ర ఖాజాన దివాళా తీసిందని ఆరోపించారు. ఉద్యోగ నియామకాల పేరుతో నోటిఫికేషన్లు ఇచ్చి ప్రక్రియ పూర్తి చేయడంలో చిత్తశుద్ధి చాటడం లేదని అన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించి జారీ చేసిన జీఓ 317 పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
న్యాయమైన కోర్కెల సాధన కోసం ప్రగతి భవన్ ముట్టడించిన మహిళ ఉపాధ్యాయులను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని బండి సంజయ్ అన్నా రు. రాష్ట్ర ఖజానాకు తూట్లు పొడిచిన సీఎం కేసీఆర్, తాజాగా జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడం విడ్డురంగా ఉందని అన్నారు. రాష్టంలో చేపట్టిన అభివృద్ధి కేవలం కాగి తాలకు అంకితమైందని ఆయన ఎద్దేవా చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిని రాజకీయం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి భారీ మొత్తంలో నిధులు మంజూరు చేసిన, సెంట్రల్ రాష్టానికి సహకరించడం లేదని చెప్పడం సరికాదని అన్నారు. తెలంగాణ రాష్టంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోష్యం చెప్పారు. కాంగ్రెస్ గురించి పట్టించుకోవద్దని, అధికారమే లక్షంగా కార్య ర్తలు, పదాధికారులు పని చేయాలని పిలుపునిచ్చారు.
రాష్టంలో జరుగుతున్నది అరాచక పాలన అని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామిక పాలన కేవలం బీజేపీకే సాధ్యమని తెలిపారు. కేసీఆర్ అవినీతి పాలనపై కేంద్రం త్వరలోనే చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యమ స్ఫూర్తిగా...
రాష్టంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకుపోవడంలో ప్రజా సంగ్రామ యాత్ర తరహాలోనే ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలని బీజేపీ స్టేట్ ఎగ్స్ క్యూటివ్ సమావేశం తీర్మానించింది. ఇందులో భాగంగానే ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపులేని పోరా టాన్ని కొనసాగించాలని నిర్ణయించా రు. సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరవేయాలని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్షల కోట్లు అప్పులు చేసిన కేసీఆర్ , తన కుటుంబ సభ్యులతో ఏకపక్ష పాలన సాగిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రజా పోరాటం నిర్మిద్దామని పిలుపునిచ్చారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున కాకుండా సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయం ప్రారంభించడం ఏంటని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన మీరు, సచివాలయ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇది కాక దళితులకు ఇస్తానన్న మూడెకరాల వ్యవసాయ భూమి, దళితుడికే ముఖ్యమంత్రి పదవి, దళిత బంధు వంటి పథకాలపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇకనిరుద్యోగ భృతి , రూ.లక్ష రుణమాఫీ వంటి కార్యక్రమాలు కేసీఆర్ ధ్వంద నీతికి నిదర్శనమని అన్నారు. నిన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Bjp, CM KCR, Kishan Reddy, Mahabubnagar, Telangana