కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. దేశపౌరులంతా లాక్డౌన్కు కట్టుబడి ఉండడంతో తాను అందుకు అతీతుడను కాదని నిరూపించాడు ఓ కేంద్రంమంత్రి. వివరాల్లోకి వెళితే.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి తల్లి అండాలమ్మ ప్రథమ వర్థంతిని సోమవారం తన స్వగామ్రం రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్లో చేయాల్సి ఉంది. కానీ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలోనే ఉండడం.. లాక్డౌన్ నేపథ్యంలో స్వగ్రామానికి రాలేకపోతున్నారు. దీంతో తోబుట్టువులు తిమ్మాపూర్లో, కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసం నుంచి ఆన్లైన్ ద్వారా తన తల్లి వర్థంతిని శాస్త్రోక్తంగా చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Kishan Reddy, Rangareddy, Union Home Ministry