KARIMNAGAR DALITA BHANDU FOR THREE MORE MANADALS OF KARIMNAGAR DISTRICT VRY KNR
Dalita Bhandu : మరో మూడు మండలాలకు దళిత బంధు.. సమీక్షించిన మంత్రి
హార్వెస్టర్ నడుపుతున్న మంత్రి గంగుల
Dalita Bhandu : కరీంనగర్ జిల్లాలో మరో మూడు మండలాలకు ధళిత బంధు పథకాన్ని అందించనున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రతి నియోజక వర్గంలో వంద కుటుంబాలకు మార్చిలో అమలు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో దళిత బంధు అమలుపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఏ ప్రధాన మంత్రి గానీ, ముఖ్యమంత్రి గానీ చేపట్టని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చేపడుతున్నారని మంత్రి తెలిపారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కన్న కలల్ని నిజం చేసెందుకు దళితుల అభివృద్దిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి కే.సి.ఆర్. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారని అన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం లో అర్హులైన 17,556 కుటుంబాల ఖాతాల్లో దళిత బంధు నగదు జమ చేశామని తెలిపారు. 1500 లకు పైగా కుటుంబాలు డెయిరీ యూనిట్లను ఎంపిక చేసుకోగా వారికి శిక్షణ ఇప్పించి యూనిట్లను మంజూరు చేయించామని మంత్రి తెలిపారు. డెయిరీ షెడ్ల నిర్మాణం కోసం రూ.లు 1.50 లక్షలు అందించామని అన్నారు. 6,800 మంది ట్రాన్స్ పోర్ట్ వాహనాల కోసం ధరఖాస్తు చేసుకోగా అందులో అర్హులైన వారికి లైసెన్సులు ఇప్పించామని తెలిపారు. దళిత బంధు పథకంలో లాభసాటిగా ఉండే డెయిరీ యూనిట్లకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, మిగతా యూనిట్లకు లబ్దిదారులకు అవగాహన కల్పించి యూనిట్లను గ్రౌండింగ్ చేస్తున్నామని అన్నారు.
ఇక జిల్లాలోని కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశలో మార్చి 31 వ తేదీలోగా వంద యూనిట్ల చొప్పున దళిత బంధు పథకం అమలు చేస్తామని తెలిపారు. వచ్చే నెల ఫిబ్రవరి 15 వ తేదీ లోగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారుల సహాయంతో లబ్దిదారులను ఎంపిక చేసి మార్చి 1 వ తేదీ లోగా జాబితా తయారు చేయాలని సూచించారు. దశల వారీగా దళిత కుటుంబాలందరికి దళిత బంధు అమలు చేస్తామని, ఎవ్వరూ కూడా నిరాశ చెందవద్దని మంత్రి సూచించారు.
అంతకు ముందు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద తెలంగాణ దళిత బంధు ఆస్తులను పంపిణి చేశారు. ఈ సంధర్భంగా 24 మంది లబ్దిదారులకు 10 యూనిట్లుగా, 6 హర్వెస్టర్లు, 3 జేసిబిలు, 1 డిసిఎం వ్యాన్ లు మంత్రి పంపిణీ చేశారు. ఒక్కో హర్వెస్టర్ రూ.లు 22 లక్షలు, ఒక్కో జేసిబి రూ.లు 34 లక్షలు, డిసిఎం వ్యాన్ రూ.లు 24 లక్షలు కాగా మొత్తంగా 2 కోట్ల 60 లక్షల విలువ చేసే వాహనాలను లబ్దిదారులకు అందించామని మంత్రి తెలిపారు. ముగ్గురు లేదా నలుగురు కలిసి బృందంగా ఏర్పడి హార్వెస్టర్లు, జేసిబిలు, డిసిఎం వ్యాన్ ఎంపిక చేసుకున్నారని అన్నారు. వీటితో లబ్దిదారులు ఆర్థికాభివృద్ది సాధిస్తారని తెలిపారు. అర్హులైన లబ్దిదారులు స్వయం ఉపాధిగా లాభసాటి యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి హార్వేస్టర్లు నడిపి ఆకట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.