హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: మంత్రి కేటీఆర్ పర్యటనలో టెన్షన్..టెన్షన్..కాన్వాయ్ ను అడ్డుకున్న ABVP కార్యకర్తలు

KTR: మంత్రి కేటీఆర్ పర్యటనలో టెన్షన్..టెన్షన్..కాన్వాయ్ ను అడ్డుకున్న ABVP కార్యకర్తలు

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

మంత్రి కేటీఆర్ (ఫైల్ ఫోటో)

మంత్రి కేటీఆర్ (Minister KTR) కరీంనగర్ పర్యటనలో టెన్షన్ వాతావణం నెలకొంది. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో కరీంనగర్ కు చేరుకున్న కేటీఆర్ (Minister KTR) అక్కడి నుండి కాన్వాయ్ లో బయలుదేరారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాన్వాయ్ ముందే వారు నిరసనకు దిగారు. దీనితో పోలీసులకు ఏబివిపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

మంత్రి కేటీఆర్ (Minister KTR) కరీంనగర్ పర్యటనలో టెన్షన్ వాతావణం నెలకొంది. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో కరీంనగర్ కు చేరుకున్న కేటీఆర్ (Minister KTR) అక్కడి నుండి కాన్వాయ్ లో బయలుదేరారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాన్వాయ్ ముందే వారు నిరసనకు దిగారు. దీనితో పోలీసులకు ఏబివిపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  చివరకు ABVP కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అయితే ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకోబోతున్న సమయంలో ఓ జడ్పీటీసీ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏబీవీపీ కార్యకర్తల్లో ఒకరిని జడ్పీటీసీ కాలుతో తన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

School Bus Accident: స్కూల్ బస్సును ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..15 మంది విద్యార్థులకు గాయాలు

కరీంనగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించనున్నారు.  సుమారు రూ. 49 కోట్లతో చేపట్టనున్న ఎంజేపీ గురుకుల విద్యాలయం, కస్తూర్భాగాంధీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, డబుల్ బెడ్రూం ఇండ్లు, కుల సంఘం భవనాలు, బస్టాండ్ నిర్మాణం, అయ్యప్ప ఆలయం, ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి. ఇక మంత్రి పర్యటనలో మంత్రులు గంగుల కమలాకర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు సహా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులూ, మండల నాయకులు పాల్గొననున్నారు.

IT Raids: హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం..ఈసారి ఆ కంపెనీ టార్గెట్ గా..

ఇక హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) గులాబీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మొదటిసారి ఈటల సొంత గ్రామం కమలాపూర్ లో కేటీఆర్ పర్యటిస్తుండడం గమనార్హం. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసే దిశగా ఏర్పాట్లు చేశారు. కమలాపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని కేటీఆర్ (Minister KTR) తిరుగు ప్రయాణమవుతారని సమాచారం.

చాలా రోజుల తర్వాత ఈటెల ఇలాకాలో కేటీఆర్ (Minister KTR) రావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది. జమ్మికుంట బహిరంగ సభలో కేటీఆర్ (Minister KTR) ఈటెలపై ఏమైనా వ్యాఖ్యలు చేస్తారా అనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మరి బహిరంగ సభలో కేటీఆర్ ఏం మాట్లాడుతారో చూడాలి.

First published:

Tags: Etela rajender, Huzurabad, Karimnagar, KTR, Telangana

ఉత్తమ కథలు