KARIMNAGAR A FIRE BROKE OUT AT THE SULTANABAD ISOLATION CENTER IN PEDDAPALLI DISTRICT VB KNR
Telangana: ఐసోలేషన్ సెంటర్లో అగ్ని ప్రమాదం.. భయాందోళనలో కరోనా రోగులు.. ఎక్కడంటే..
అగ్ని ప్రమాదం జరగడంతో ఆందోళన చెందుతున్న రోగులు
Telangana: కరోనా బారిన పడి ఐసోలేషన్ సెంటర్లో చికిత్స తీసుకుంటున్న కరోనా రోగులు ఒక్కసారిగి ఉలిక్కిపడ్డారు. కేంద్రం ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రికి సంబంధించి కొంత సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
సుల్తానాబాద్ కరోనా ఐసొలేషన్ సెంటర్ ఆస్పత్రి ఆవరణలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారా.. లేక ఆస్పత్రి సిబ్బంది నిప్పు పెట్టారా.. అనేది తెలియాల్సి ఉంది. అయితే ఆస్పత్రికి సంబంధించిన వాటర్ పైపులు, కరెంటు మోటారు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదంపై ఆసుపత్రి వర్గాలను వివరణ అడగ్గా తమకేమీ తెలియదంటూ సమాధానం ఇచ్చారు. కరోనా పేషెంట్లకు సమీపంలోనే ఈ అగ్నిప్రమాదం జరిగింది. విపరీతమైన పొగతో కరోనా పేషెంట్లకు తీవ్ర ఇబ్బంది కలిగింది. ఐసోలేషన్ కేంద్రంలో 30 మంది వరకు కోవిడ్ బాధితులు ఉన్నారు. ఆస్పత్రి ఆవరణలోని బావి నీటిని ఐసోలేషన్ కేంద్రానికి వాడతారు. అగ్ని ప్రమాదంపై ఆసుపత్రి వెనకభాగంలో ఉన్న వైద్య సిబ్బంది ఎవరు పట్టించుకోలేదు. కవరేజికి వెళ్లిన మీడియా తో పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు.
ఆసుపత్రి ఆవరణలోని పైపులు కాలిపోయిన దృశ్యం
సుల్తానాబాద్ కరోనా ఐసోలేషన్ సెంటర్లో రక్షణ కరువైందని పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలని కరోనా రోగులు వారి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరికీ కి ఎలాంటి ప్రమాదం జరగక పోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.