డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం.. కాచిగూడ ఘటనపై రైల్వే అధికారులు
MMTS train accident: రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చేలా ఎవరూ సిగ్నల్ ఇవ్వలేదని.. మరి సిగ్నల్ ఇవ్వకుండా లోకో పైలట్ ఆ ట్రాక్ మీదకు ఎందుకు తీసుకెళ్లాడో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు.
news18-telugu
Updated: November 11, 2019, 3:51 PM IST

MMTS రైలు ప్రమాద దృశ్యం
- News18 Telugu
- Last Updated: November 11, 2019, 3:51 PM IST
కాచిగూడ రైలు ప్రమాదంపై సౌత్ సెంట్రల్ రైల్వే (scr) అధికారులు స్పందించారు. రెండు రైళ్లు ఢీకొట్టుకోవడానికి సిగ్నలింగ్ వ్యవస్థ కారణం కాదని.. అందులో ఎలాంటి లోపం లేదని cpro రాకేష్ వెల్లడించారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్పైకి వచ్చేలా ఎవరూ సిగ్నల్ ఇవ్వలేదని.. మరి సిగ్నల్ ఇవ్వకుండా లోకో పైలట్ ఆ ట్రాక్ మీదకు ఎందుకు తీసుకెళ్లాడో దర్యాప్తులో తేలుతుందని తెలిపారు. అటు రైల్వే ఏజీఏం బీబీ సింగ్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లోకో పైలట్ (రైలు డ్రైవర్) తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇవాళ ఉదయం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లో నిలిపి ఉన్న హంద్రీ ఎక్స్ప్రెస్ రైలును లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ సహా 20 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జవడంతో డ్రైవర్ లోపలే చిక్కుకుపోయాడు. అతడిని బయటకు తీసేందుకు కాచిగూడ్ స్టేషన్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ఇవాళ ఉదయం రైలు ప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్లో నిలిపి ఉన్న హంద్రీ ఎక్స్ప్రెస్ రైలును లింగంపల్లి నుంచి ఫలక్నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. రెండు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇంజిన్లు బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ లోకో పైలట్ సహా 20 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ క్యాబిన్ నుజ్జునుజ్జవడంతో డ్రైవర్ లోపలే చిక్కుకుపోయాడు. అతడిని బయటకు తీసేందుకు కాచిగూడ్ స్టేషన్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పోలీసులను గన్తో కాల్చబోయారు.. సజ్జనార్ ప్రెస్మీట్..
‘దిశ’ హీరో వీసీ సజ్జనార్ ట్రాక్ రికార్డు ఇదీ..
ఉప్పల్లో నేడు టీ20 మ్యాచ్.. అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లు
దిశ హత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యం.. పాతిపెట్టిన దాన్ని బయటకు తీసి...
దిశ కేసు విచారణకు 50 మంది పోలీసులు...
హైదరాబాద్లో దారుణం... భర్తను సజీవదహనం చేసిన భార్య...
Loading...