హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఆమె తల్లిని ప్రియుడు ఏం చేశాడంటే

Hyderabad : ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఆమె తల్లిని ప్రియుడు ఏం చేశాడంటే

ప్రతికాత్మకచిత్రం

ప్రతికాత్మకచిత్రం

Hyderabad: తనతో నిశ్చితార్ధం రద్దు చేసుకొని ..వేరే పెళ్లి చేస్తున్నారనే కోపంతో ఓ ప్రేమోన్మాది ప్రియురాలితో పాటు ఆమె తల్లిపై దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన ప్రియురాలి తల్లి చికిత్స పొందుతూ మృతి చెందింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అమ్మాయి ప్రేమ కోసం తల్లీ, కూతుళ్లపై కత్తితో ప్రేమోన్మాది దాడి చేశాడు. దాడిలో తీవ్రంగా గాయిపడిన మహిళ మృతి చెందింది. హైదరాబాద్‌hyderabad మియాపూర్‌లోని ఆదిత్యనగర్‌లో నివాసముంటున్న శోభా (Shobha)అనే 45ఏళ్ల మహిళతో పాటు ఆమె కూతురు వైభవి (Vaibhavi)ని కూరగాయలు కట్ చేసే కత్తితో దాడి చేశాడు సందీప్(Sandeep). అటుపై తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం(Tuesday)స్థానికంగా కలకలం రేపిన ఈసంఘటనలో తీవ్రంగా గాయపడిన తల్లి,కూతురిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ శోభ బుధవారం మరణించింది.

Bandi Sanjay: బండి సంజయ్‌కి ఊహించని షాక్ .. సొంత ఇలాఖాలోనే ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు

పెళ్లికి ఒప్పుకోలేదని..

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకుకు చెందిన సందీప్ హైదరాబాద్‌ మియాపూర్‌లో నివాసముంటున్న శోభ కుమార్తె వైభవి ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి నిశ్చితార్ధం కూడా చేశారు. అయితే సందీప్, వైభవి మధ్య మనస్పర్దలు రావడంతో నిశ్చితార్ధం రద్దు చేసుకొని ఫ్యామిలీ హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో బ్యూటిషియన్ కోర్సు చేస్తున్న వైభవికి మరో వ్యక్తితో నిశ్చితార్ధం జరిపించింది తల్లి శోభ. ఆ విషయం తెలసుకున్న సందీప్ వైభవితో తనకు వివాహం చేయడం లేదనే కోపంతో గుంటూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. కోపంతో రగిలిపోయి ఇంట్లోని కత్తితో తల్లీ, కూతురుపై విచక్షారహితంగా దాడి చేశాడు.

ప్రియురాలి తల్లిని చంపిన యువకుడు..

ప్రేమోన్మాది సందీప్‌ మొదట యువతి వైభవిపై కత్తితో దాడి చేస్తుండగా అడ్డుగా వెళ్లిన ఆమె తల్లి శోభను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన శోభ పొత్తి కడుపు, ఛాతి భాగంలో గాయలవడంతో ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈసంఘటనలో యువతి వైభవి కూడా గాయపడింది. క్షణికావేశంలో కత్తితో గాయపరిచిన సందీప్‌ అనంతరం అదే కత్తితో తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు తెలిపారు.

Hyderabad: ఇండియాలోనే అత్యంత ఖరీదైన మెక్‌లారెన్‌ కారుని మొదటగా కొన్న హైదరాబాదీ .. కారు ఖరీదెంతో తెలుసా..?

కత్తితో ప్రేమోన్మాది దాడి..

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఈసంఘటన స్థానికంగా కలకలం రేపింది. 19ఏళ్ల వైభవి ప్రేమోన్మాది చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సందీప్‌ కూడా గాయపడినట్లుగా పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime news, Hyderabad, Women died

ఉత్తమ కథలు