హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: రాజధానిలో వరకట్న వేధింపులు.. తట్టుకోలేక ఆ ఇల్లాలు కఠిన నిర్ణయం..

Hyderabad: రాజధానిలో వరకట్న వేధింపులు.. తట్టుకోలేక ఆ ఇల్లాలు కఠిన నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమ్మ, నాన్న అన్నీ తానై చూసుకోవల్సిన బాధ్యత భర్తదే.. కానీ కొందరు భర్తలు మాత్రం కట్టుకున్న నాటి నుంచే భార్యలకు నరకయాతన అనుభవించేలా చేస్తున్నారు.

దేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. మహిళలపై ఏదో ఒకరకమైన వేధింపులు తప్పడం లేదు. ఏడు అడుగులు వేసి.. మూడు ముళ్లు వేసి.. వేద మంత్రాల సాక్షిగా జీవితాంతం పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణాలు చేసిన భర్తల నుంచి వేధింపులు ఎదురైతే వారి బాధలు ఎవరికి చెప్పుకోవాలి.. పెళ్లైనంత వరకే మహిళ బాధ్యత తల్లిదండ్రులది.. తరువాత అమ్మ, నాన్న అన్నీ తానై చూసుకోవల్సిన బాధ్యత భర్తదే.. కానీ కొందరు భర్తలు మాత్రం కట్టుకున్న నాటి నుంచే భార్యలకు నరకయాతన అనుభవించేలా చేస్తున్నారు. కట్నం తీసుకోవడం నేరమని చెబుతున్నా.. కఠిన శిక్షలు వేస్తున్నా..వరకట్న వేధింపుల సంఘటనలు ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ (Hyderabad) పరిధిలోని గచ్చిబౌలి శివారులో సునీత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం తీసుకు రావాలంటూ భర్త, అత్త మామలు ఆమెను తీవ్రంగా వేధించారు. శారీరకంగా, మానసికంగా ఆమెను హింసించారు. సునీతను భర్త తీవ్రంగా కొట్టేవాడు. ఈ వేధింపులు (Dowry harassment) భరించలేకే సునీత సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

మౌనంగా  భరించింది..

సునీతతో భర్త రమేశ్ నిత్యం గొడవ పడేవాడు. అదనపు కట్నం తీసుకురావాలని హింసించే వాడు. మొదట్లో కట్నం తీసుకురావాలని మెల్లిగా అడిగాడు. తర్వాత కొద్దిగా స్వరం పెంచాడు. అనంతరం సూటిపోటి మాటలతో గుచ్చే వాడు. భర్త అంతగా ఇబ్బంది పెడుతున్నా తల్లిదండ్రులకు తన సమస్య గురించి చెప్పలేదు సునీత. మౌనంగా భర్త వేధింపులను భరించింది. సునీత దారికి రాకపోవడంతో రమేశ్ సునీతను శారీరకంగా వేధించడం ప్రారంభించాడు. కట్నం తీసుకు వస్తావా లేదా అంటూ సునీతను భర్త జుట్టు పట్టుకుని కొట్టేవాడు. రూ. 10 లక్షలు తీసుకురావాలని, వాటితో కారు కొంటానంటూ కొట్టేవాడు.

మరోవైపు కొడుకు రమేశ్ ను వారించాల్సిన తల్లిదండ్రులూ అతని వెంటే నిలిచారు. రమేశ్ శారీరకంగా హింసిస్తే.. వాళ్లు మాటలతో మానసికంగా హింసించారు. భర్త, అత్తమామలు పెట్టే టార్చర్ రోజురోజుకూ ఎక్కువ కావడంతో సునీత ఇక దాచుకోలేక పోయింది. తనను తీవ్రంగా కొడుతున్నాడని, హింసిస్తున్నాడని, అత్తమామాలు మాటలతో వేధిస్తున్నారని తల్లిదండ్రులతో చెప్పుకుంది. బాధనంతా చెప్పుకుని కన్నీటి పర్యంతం అయింది. ఆ తర్వాత సునీత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.

కాగా, ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో సునీత తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. భర్త, అత్తమామలు తనను ఏమైనా చేశారా అని వారిని భయం చుట్టుముట్టింది. హుటాహుటినా వెళ్లి చూడగా సునీత ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. తల్లిదండ్రులు వచ్చే సరికే సునీత ప్రాణాలు గాలిలో కలిశాయని ఆమె తల్లిదండ్రులు విలపించారు. విజయనగరానికి చెందిన సునీతకు అదే ప్రాంతానికి చెందిన రమేశ్ తో 2019లో పెళ్లి జరిగింది. రమేశ్ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో రమేశ్ కు బంగారంతో పాటు రూ.1 4 లక్షలు నగదు, 20 సెంట్ల భూమి ఇచ్చారు. అయినా రమేశ్ అదనపు కట్నం కోసం వేధించాడు.

First published:

Tags: Dowry harassment, Hyderabad, Wife suicide, Woman suicide

ఉత్తమ కథలు