సాధారణంగా మన చిన్న వయసులో నువ్వు ఏమి కావాలని ఆకుంకుంటున్నావ్ అని ఎవరైనా అడిగితే డాక్టర్, ఇంజనీర్ అనే సమాధానం ఇస్తుంటారు. అయితే చాలా మంది సినీ స్టార్లు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటూ చెప్పుకొచ్చిన సంధర్బాలెన్నో ఉన్నాయి. మన తల్లిదండ్రులు కూడా మనల్ని మంచి స్థానంలో ఉండాలనే కోరుకుంటారు. అయితే దీనికి రాజకీయ నాయకులేమి మినహాయింపు కాదు. తాజాగా హైదరాబాద్ AIG ఆసుపత్రిలో నిర్వహించిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాన్ క్లెవ్ లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తన తల్లి కూడా తనను డాక్టర్ చూడాలని గట్టిగా కోరుకున్నారని అన్నారు. కానీ అనుకోని కారణాల వల్ల రాజకీయాల్లో అడుగుపెట్టానని కేటీఆర్ (Minister KTR) తెలిపారు.
Minister @KTRTRS today participated in the @AIGHospitals’ Women in Medicine Conclave. In his keynote address, the Minister said that though there is a rise in number of women pursuing medicine compared to the last decade, there still is a dearth of female doctors in India. pic.twitter.com/BjlrbIEY73
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 3, 2022
ప్రతి ఇంట్లో తల్లి తమ పిల్లల్లో ఒక్కరైనా డాక్టర్ కావాలని అనుకుంటారు. అలాగే తమ తల్లి కూడా అలాగే అనుకుందని కేటీఆర్ అన్నారు. వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైంది. వైద్యరంగంలో మహిళల రాణించడం అభినందనీయం అన్నారు. వైద్యరంగంలో భారత్ ఎంతో పురోగమిస్తుందని అన్నారు. ఇక కరోనా టీకా తయారీలో మహిళల పాత్ర మరిచిపోలేనిదని గుర్తు చేశారు.
కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారు..
వైద్యరంగం ఎంతో ఉన్నతమైనది. వైద్యులు కుటుంబ జీవితాన్ని త్యాగం చేస్తారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎప్పుడు ఎమర్జెన్సీ అయినా కూడా అందుబాటులోకి వస్తారని అన్నారు. కొత్త టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉండాలని కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని అన్నారు. ఇక వైద్య రంగంలో మహిళల సేవలు గొప్పవని పేర్కొన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం కోసం వీ హబ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు. కరోనా సమయంలో AIG ఆసుపత్రి సేవలు మరువలేనివని కేటీఆర్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona campaigned, Hyderabad, KTR, Minister ktr, Telangana