హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఎమ్మెల్యేల ఎర కేసులో ఊహించని ట్విస్ట్..సీబీఐ ఢిల్లీ విభాగానికి దర్యాప్తు బాధ్యతలు

Telangana: ఎమ్మెల్యేల ఎర కేసులో ఊహించని ట్విస్ట్..సీబీఐ ఢిల్లీ విభాగానికి దర్యాప్తు బాధ్యతలు

CBI

CBI

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Telangana

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఈ కేసును ఇటీవల సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్ళింది. ఈ క్రమంలో నేడు విచారణ జరిపిన కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు కోరుతూ సీఎస్ కు లేఖ రాశామని హైకోర్టుకు సీబీఐ (Central Burew of Investigation) పేర్కొంది. సిట్ మాకు ఎలాంటి డాకుమెంట్స్ ఇవ్వలేదు. ఇస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలపగా..హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆగాలని కోర్టు సీబీఐ (Central Burew of Investigation)కి సూచించింది. ఈ క్రమంలో సీబీఐ డైరెక్టర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు.

PM Narendra Modi: తెలంగాణ నుంచి ప్రధాని మోదీ పోటీ..? ఆ సీటుపైనే బీజేపీ ఫోకస్..!

ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న తీర్పును సవాల్ చేస్తూ..సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ పై నేడు తెలంగాణ హైకోర్టు (Telangana High court)లో విచారణ జరిగింది. ఈ కేసు విచారణ సందర్బంగా వాడీవేడి వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివరాలు కోరుతూ సీఎస్ కు లేఖ రాశామని హైకోర్టుకు సీబీఐ  (Central Burew of Investigation) పేర్కొంది. సిట్ మాకు ఎలాంటి డాకుమెంట్స్ ఇవ్వలేదు. ఇస్తే దర్యాప్తు చేస్తామని సీబీఐ తెలపగా..హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఆగాలని కోర్టు సీబీఐ (Central Burew of Investigation)కి సూచించింది.  సిబిఐ వాదన కూడా వింటామని హైకోర్టు పేర్కొంది.

kadapa: సంక్రాతి పండుగకి ఆర్టీసీ బంపర్ ఆఫర్స్.. ఏంటో తెలుసా..?

ఈ కేసుకు సంబంధించి బీజేపీ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదు. అలాగే ఒక్క ఎమ్మెల్యేను కానీ కొనుగోలు చేయలేదు. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారని దామోదర్ రెడ్డి వాదించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేరాలని కేసీఆర్ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారని దామోదర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సిట్ దర్యాప్తు నిలిపేయాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో ఈ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక తాజాగా హైకోర్టు తీర్పు కాపీ సీబీఐకి చేరింది. 98 పేజీలతో కూడిన ఈ తీర్పు కాపీలో కోర్టు కీలక విషయాలు ప్రస్తావించింది. ఈ కేసు సిట్ నుండి సీబీఐకి అప్పగించడానికి మొత్తం 45 కారణాలను కోర్టు పేర్కొంది.

First published:

Tags: Hyderabad, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు