హోమ్ /వార్తలు /తెలంగాణ /

Live Murder: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపారు ..లైవ్ మర్డర్‌ వీడియో తీసిందెవరో తెలుసా..?

Live Murder: నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే నరికి చంపారు ..లైవ్ మర్డర్‌ వీడియో తీసిందెవరో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి వెంబడించి కత్తులు, కటార్లతో పొడిచి చంపారు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు. రోడ్డుపై వెళ్తున్న జనం చూస్తుండగానే ఈ లైవ్ మర్డర్‌ జరిగింది. హంతకుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గ్రేటర్ హైదరాబాద్‌(Hyderabad)లో పట్టపగలు, నడిరోడ్డుపై దారుణం జరిగింది. ఓ వ్యక్తిని వేటాడి వెంబడించి కత్తులు, కటార్లతో పొడిచి చంపారు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు. రోడ్డుపై వెళ్తున్న జనం చూస్తుండగానే ఈ లైవ్ మర్డర్‌(Live Murder) జరిగింది. ఈ మర్డర్ పురానాపూల్‌(Puranapool)సమీపంలోని జియాగూడ బైపాస్‌ రోడ్డు (Jiyaguda Bypass road)దగ్గర చోటుచేసుకుంది. దుండగుల చేతిలో హతమైన వ్యక్తి కోఠి ఇస్లామియా బజార్‌కు చెందిన జంగం సాయినాథ్‌(Jangam Sainath)గా పోలీసులు గుర్తించారు. హత్య చేసి పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంఘటన జరిగిన పరిసరాల్లోని సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు.

Nagoba Jatara: అడవిలో ఆదివాసీ గిరిజనుల పండుగ.. ప్రారంభమైన నాగోబా జాతర

నడిరోడ్డుపై రక్తచరిత్ర..

నడి రోడ్డుపై ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు సినిమా స్టైల్లో పరిగెత్తించుకుంటూ కత్తులు, వేట కొడవళ్లతో అత్యంత కిరాతకంగా నరికి చంపిన సంఘటన హైదరాబాద్ జియాగూడ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డుపై జనం చూస్తుండానే ముగ్గురు సాయినాథ్ అనే వ్యక్తిని చుట్టుముట్టి నరికి చంపారు. రోడ్డుపై వెళ్తున్న వారిలో ఒకరు ఈ లైవ్ మర్డర్‌ దృశ్యాల్ని సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కుల్పుంపూర పోలీసులు మర్డర్ జరిగిన స్పాట్‌కు చేరుకున్నారు. మృతుడు కోఠిలోని ఇస్లామియా బజార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

సినీ ఫక్కీలో మర్డర్ ..

పట్టపగలు ఓ వ్యక్తిని నరికి చంపడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు ఘటన స్తలాన్ని పరిశీలించారు. మృతుడ్ని ఎందుకు చంపారు..? ఎవరు చంపారనే ? విషయంపై ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసిన తర్వాత దుండగులు మూసీ నదిలోకి దూకి పారిపోయినట్లుగా స్థానికులు పోలీసులకు తెలియజేశారు. అక్కడే ఓ వ్యక్తి తీసిన వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్నారు.

First published:

Tags: Hyderabad news, Telangana crime news

ఉత్తమ కథలు