రాజకీయ కురువృద్దుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అపార అనుభవం కలిగిన నేతగా సమాజ్వాది పార్టీ ద్వారా దేశ నేతగా ఎదిగిన ములాయం సింగ్ యాదవ్ మరణాన్ని చింతిస్తూ ఆయన కుమారుడు అఖిలేష్యాదవ్తో పాటు కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కేసీఆర్ సంతాపం..
యూపీ మాజీ సీఎం, సమాజ్వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 82సంవత్సరాల ములాయం గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ములాయం సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ ములాయం సింగ్ యాదవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ కు, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
— Telangana CMO (@TelanganaCMO) October 10, 2022
రాజకీయ కురువృద్ధుడికి నివాళి..
తెలంగాణ ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ములాయంసింగ్ యాదవ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో అపార అనుభవాన్ని గడించిన కురువృద్ధుడి మరణాన్ని చింతిస్తూ ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్తో పాటు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలియజేశారు కేటీఆర్ . ములాయంసింగ్ మరణం నిజంగా భారత రాజకీయాల్లో శకానికి ముగింపు లాంటిదని పేర్కొన్నారు. అలాగే సమాజ్వాదీ పార్టీ నాయకులు, అభిమానులందరికి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
My wholehearted condolences to Sri @yadavakhilesh Ji and the entire family of Sri Mulayam Ji Rest in peace Neta Ji ???? This is truly end of an era in Indian politics & my prayers for strength to all Samajwadi Party leaders/loyalists https://t.co/1Z776lJWbp
— KTR (@KTRTRS) October 10, 2022
కుటుంబ సభ్యులకు సంతాపం..
యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు. సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎంగా పనిచేసిన ములాయం సింగ్ యాదవ్ దేశానికి చేసిన కృషి అపారమైనదిగా పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్వీట్ చేశారు హరీష్రావు. మలాయం సింగ్ కుటుంబ సభ్యులు, సమాజ్వాది పార్టీ శ్రేణులకు తన హృదయపూర్వక సానుభూతిని ప్రకటించారు.
Deeply Saddened by demise of veteran politician @samajwadiparty founder and former CM of UP Shri Mulayam Singh Yadav ji. His contribution to the nation was immense. My heartfelt condolences to his family, friends & Samajwadi Party cadre. May his soul Rest in peace. Om Shanti???????? pic.twitter.com/E6SiLsjqIq
— Harish Rao Thanneeru (@trsharish) October 10, 2022
రేపు యూపీకి కేసీఆర్..
ములాయం సింగ్ యాదవ్కు నివాళులర్పించడానికి, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంగళవారం కేసీఆర్ ఉత్తరప్రదేశ్కు బయల్దేరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Samajwadi Party, Telangana News