హైదరాబాద్ నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఎస్వోటి అధికారులు రట్టు చేశారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును ఎస్వోటి అధికారులు (SWOT officials) రట్టు చేశారు. వారి వద్ద నుంచి 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకన్నారు. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు (UP) చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరు ఒడిశా (Odisha) నుంచి హైదరాబాద్ (Hyderabad) మీదుగా గంజాయి రవాణా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ గంజాయిని యూపీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సరఫరా (Supply) చేసేందుకు తీసుకెళ్తున్నట్టుగా కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి పరారీలో ఉన్న ముగ్గురు యూపీ వాసుల కోసం పోలీసులు (Police) గాలింపు చేపట్టారు.
గతంలోనూ 156 ప్యాకెట్లు..
కాగా, గతంలోనూ గంజాయి భారీగా పట్టుబడింది. మహారాష్ట్ర (Maharashtra) నాసిక్కు చెందిన వికాస్జాదవ్, ఒడిస్సా, మోహిపాల్పుట్కు చెందిన సుభాష్కుమార్, మహారాష్ట్రకు చెందిన చెందిన అశోక్కూలే, అమోల్, విలాస్ జగనాథ్ పచోరే, ఫిరోజ్ మోమిన్, సుధామ్ గౌటేకర్, ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ కుమార్సింగ్ ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఒడిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ ఏజెన్సీ నుంచి నాసిక్కు గంజాయి (ganja) అక్రమంగా రవాణా చేస్తున్నారు. అక్కడ కిలో గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి రూ. 20 వేలకు విక్రయిస్తున్నారు. కోరాపుట్లో సుభాష్కుమార్ గంజాయి సాగు చేస్తుండగా వికాస్ జాదవ్ అతడి నుంచి గంజాయి (cannabis) కొనుగోలు చేసి అశోక్కూలే, అమోల్కు అప్పగించేవాడు. వారు విలాస్జగనాథ్, రాహుల్ కుమార్, ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో నాసిక్కు గంజాయి తరలించేవారు.
వికాస్ జాదవ్, సుభాష్కుమార్ 800 కిలోల గంజాయిని హైదరాబాద్ (Hyderabad) మీదుగా మహారాష్ట్రకు సరఫరా (Transport) చేయాలని నిర్ణయించారు. వికాస్ జాదవ్, అశోక్కూలే, అమోల్కు ఈ విషయం చెప్పడంతో వారు జగన్నాథ్, రాహుల్కుమార్ సింగ్లకు ఫోన్ చేసి తమ ప్లాన్ను వివరించారు. ఫీరోజ్ మోమిన్, సుధామ్ సహకారంతో గంజాయిని (cannabis) ఐదు కిలోల చొప్పున 156 ప్యాకెట్లుగా సిద్ధం చేశారు.
అశోక్కూలే, రాహుల్కుమార్ సింగ్ కారులో ముందు వెళుతుండగా, విలాస్ జగన్నాథ్, సుధామ్ డీసీఎంలో వారిని అనుసరించారు. ఎవరికీ అనుమానం రాకుండా డీసీఎం పై భాగంలో అల్లం (Ginger) సంచులను లోడ్ చేశారు. తెలంగాణలో గంజాయిపై స్పెషల్ డ్రైవ్ కొనసాగతుండటం, ఓఆర్ఆర్ టోల్గేట్ల వద్ద టోల్ రుసుముతో పాటు చెకింగ్ పాయింట్స్లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఎత్తుగడ వేశారు. నగరంలో నుంచి గూడ్స్ లారీ మాదిరిగా వెళ్లడానికి ప్రయత్నించారు. సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి, మియాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. డీసీఎం వ్యాన్ మియాపూర్ పరిధిలోకి రాగానే పట్టుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.