ఐపీఎస్ ఆఫీసర్ గా తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న సన్సెషనల్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ గత కొన్న రోజుల కిందట ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. బాధ్యతులు స్వీకరించిన దగ్గర నుంచి పలు రకాల నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా అభిరాం అనే నెటిజన్ చేసిన ట్వీట్టర్ పోస్టుకు వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అతడి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘ఇవి మన బస్సులూ.. ఇదీ మన బహిరంగ ప్రచారం.. ఎవర్ని రెచ్చగొడుతున్నాం..? ఏం కోరుకుంటున్నాం.. సినిమాని వినోదంలా చూడమని సొల్లు కబుర్లు మాత్రం ఎవరూ చెప్పొద్దూ..’’అంటూ అతడు ట్వీట్టర్ లో ఆర్టీసీని ఉద్దేశించి.. పోస్టర్లను బస్సులకు అంటించొద్దని పరోక్షంగా చెప్పాడు.
ఇవి మన బస్సులూ..
ఇదీ మన బహిరంగ ప్రచారం..?@tsrtcmdoffice @TSRTCHQ
ఎవర్ని రెచ్చగొడుతున్నాం..? ఏం కోరుకుంటున్నాం?
: సినిమాని వినోదంలా చూడమని సొల్లు కబుర్లు మాత్రం ఎవరూ చెప్పొద్దూ..! pic.twitter.com/ck9QZwGxby
— ABHIRAM NETHA (@AbhiramNetha) September 15, 2021
In order to Prevent #disfigurement & objectionable Posters on #RTC Buses #MD @TSRTCHQ Sri #VCSajjanar #IPS has Passed instructions to all Officers to Remove all such Kind of Posters immediately #ActNow#Revolution #publictransport@TelanganaCMO @KTRTRS @puvvada_ajay @DonitaJose pic.twitter.com/Zhfn9ImKj4
— TSRTC MD Office (V.C Sajjanar IPS) (@tsrtcmdoffice) September 16, 2021
దీని ద్వారా యువత విపరీతంగా నష్టపోతుందని పేర్కొన్నాడు. ఆ ట్వీట్ విపరీతంగా వైరల్ కావడంతో @TSRTCHQ & My Self will look into it & ensure in future it doesn't happen అంటూ వీసీ సజ్జనార్ రిప్లై ఇచ్చారు. అంటే.. ఇకనుంచి ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల పోస్టర్లను నిషేధం అంటూ చెప్పాడు. ఆర్టీసీ బస్సులపై అసౌకర్యంగా, అభ్యంతరకరంగా ఉండే పోస్టర్లను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులకు సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.
ఇలా అభిరామ్ అనే ఓ జర్నలిస్టు.. ఆర్టీసీ బస్సులపై అంటించే ఆశ్లీల పోస్టర్ల విషయాన్ని సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లగా.. నెటిజన్ ట్వీట్పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బస్సులపై ఇలాంటి పోస్టర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చర్యలు తీసుకుంటానని సజ్జనార్ ప్రకటించారు. ఇచ్చిన ప్రకటన మేరకు ఆర్టీసీ బస్సులపై ఆశ్లీల ఫోటోలను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభపరిమాణం.. సజ్జానార్ సార్ రాకతొ తెలంగాణ ఆర్టీసీకి.. ప్రయాణికులకు మంచి జరుగుతోంది.. ఆర్టీసీ లాభాల్లో కి వెళ్లాలంటే.. రాజకీయ నాయకులను పుర్తిగా ఆ సంస్థ నుంచి బయటకు పంపించాలంటూ ఓ నెటిజన్ పోస్టు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.