ఈ మధ్యకాలంలో వరుసగా చిన్నారులపై జంతువుల దాడులు ఎక్కువ అవుతున్నాయి. పసివాల్లపై కుక్కలు, కోతులు దాడులకు దిగుతు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. తాజాగా హైదరాబాద్లో ఓ బాలుడిని ఇప్పుడు ఎలుక కొరికిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొంపల్లి మెక్ డొనాల్డ్స్ లో 8 ఏళ్ల బాలుడ్ని ఎలుక కరిచిన ఘటన కలకలం రేపింది. మార్చి 8న జరిగిన ఈ ఘటనలో బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి.
ఎలుక దాడి చేసిన అనంతరం తల్లిదండ్రులు ఆ బాలుడ్ని బోయిన్ పల్లి హాస్పిటల్ కి తరలించారు. వెంటనే బాబుకు టెటానస్, యాంటీ రేబిస్ డోస్ ఇంజిక్షన్లు ఇప్పించారు. మార్చి 8న మెక్ డొనాల్డ్స్ కు వచ్చిన ఫ్యామిలీ పై ఎలుక దాడి చేసింది. ఆ హోటల్ బాత్ రూమ్ నుంచి దూసుకొచ్చిన ఎలుక బాలుడిపైకి ఎక్కి కరిచింది. ఈ ఘటన అక్కడి రెస్టారెంట్ సీసీ టీవీలో రికార్డు అయింది. దీంతో ఈ ఘటనపై ఆ బాలుడి తండ్రి (ఆర్మీ ఆఫీసర్) రెస్టారెంట్ యాజమాన్యంపై కొంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
క్లీన్, హైజీన్ మెయింటెనెన్స్ విషయంలో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ ఫెయిల్ అయిందని, ఘటన జరిగిన తర్వాత కూడా రెస్టారెంట్ యాజమాన్యం ఏమీ స్పందించలేదని ఆయన ఆరోపించారు. రెస్టారెంట్ పై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Trending news