హోమ్ /వార్తలు /తెలంగాణ /

పేపర్ లీక్..గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

పేపర్ లీక్..గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత..కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ కాంగ్రెస్

తెలంగాణ కాంగ్రెస్

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో TSPSC ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ నుండి TSPSC కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో TSPSC ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ నుండి TSPSC కార్యాలయ ముట్టడికి వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అలాగే బారిగేట్లు ఏర్పాటు చేసి వారిని అడ్డుకున్నారు. కాగా TSPSC కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇకపోతే కొన్నిరోజులుగా పేపర్ లీకేజి వ్యవహారం రాష్ట్రంలో దుమారం రేపుతోంది. దీనితో ప్రతిపక్షాలు అధికార పార్టీ నిర్లక్ష్యంపై TSPSC ముట్టడికి పిలుపునిస్తున్నారు. ఈరోజు ఉదయం షర్మిల, ఆర్ఎస్ ప్రవీణ్ కూడా TSPSC ముట్టడికి పిలుపునివ్వగా..వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద హైటెన్షన్..బండి సంజయ్, ఈటెల అరెస్ట్

హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. TSPSC పేపర్ లీకేజి వ్యవహారాన్ని నిరసిస్తూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు దిగారు. ఈ క్రమంలో ఆయన అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించడానికి బీజేపీ కార్యాలయం నుంచి కాలినడకన బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అమరవీరుల స్మారక స్థూపానికి నివాళులు అర్పించడానికి ఎలాంటి అనుమతులు అవసరం లేదని బండి సంజయ్ పోలీసులను ప్రశ్నించారు. ఇక అక్కడి నుంచి గన్ పార్క్ కు చేరుకున్న బండి సంజయ్ అధికార బీఆర్ఎస్ పై మండిపడ్డారు. పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. అలాగే మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలనీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పాల్గొన్న బండి సంజయ్ ను, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సహా పలువురు నాయకులూ, కార్యకర్తలను పోలీసులు గన్ పార్క్ వద్ద అరెస్ట్ చేశారు.

Big Breaking: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్..!

బండి సంజయ్ దీక్ష నేపథ్యంలో గన్ పార్క్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బండి సంజయ్ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా..పోలీసులు గో బ్యాక్..కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. దీక్షా స్థలిని వదిలి వెళ్లాలని..ప్రజలు ట్రాఫిక్ తో ఇబ్బంది పడుతున్నారని పోలీసులు చెప్పగా..తాము ప్రశాంతంగా దీక్ష చేస్తున్నామని బండి సంజయ్ చెప్పుకొచ్చారు. కార్యకర్తలను బలవంతంగా తరలిస్తే తీవ్ర పరిణామాలుంటాయని బండి హెచ్చరించారు. నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్న కేసీఆర్ పాలన "ఇక సాలు దొర సెలవు దొర" అంటూ బీజేపీ కార్యకర్తలు నిరసన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

 కాగా తాజాగా Tspsc గ్రూప్ 1 సహా పలు పరీక్షలను వాయిదా వేసింది. మరి పేపర్ లీకేజిపై సిట్ దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.

First published:

Tags: Congress, Telangana

ఉత్తమ కథలు